Sharwanand: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ అతిథి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కలిసే పలుసార్లు మీడియా కంటపడటమే కాకుండా అదితి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక యువరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇకపోతే సిద్ధార్థ్ అతిధి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాలయ్య శర్వానంద్ ప్రశ్నిస్తూ మీ సినిమాలో హీరోయిన్లను ఎలా ఎంపిక చేసుకుంటారని ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ హీరోయిన్ల విషయంలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదని డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేయడమేనంటూ సమాధానం ఇచ్చారు. మరి అదితీ సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ మహాసముద్రం సినిమాలో తను నటించింది అయితే తాను సిద్ధార్థ్ కి జంటగా నటించిందని తెలిపారు. శర్వానంద్ ఇలా చెప్పగానే రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్ధార్థకి జంటగా మారిందా అని ప్రశ్నించడంతో శర్వానంద్ నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పారు.
వీరి రిలేషన్ గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తను హృదయపూర్వక యువరాణి అని పోస్ట్ చేసినప్పుడు నాకు కూడా వారు రిలేషన్ లో ఉన్నారేమో అనిపించింది అంటూ ఈయన వారిద్దరి రిలేషన్ గురించి సమాధానం చెప్పారు. అంటే పలికిందంటావా అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ఏమో పలికిందేమో అటు శర్వానంద్ సమాధానం చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…