శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్ఎక్స్ 100’ విజయం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నా.
జగపతిబాబు, రావురమేశ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.
డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…