రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అంత్యంత ఆక్రోశంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం సినీ పరిశ్రమపై చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. తర్వాత దీనిపై ప్రతీ ఒక్కరూ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు.
అయితే ఇదే వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా కార్యకర్తగా స్పందించాడు. దీంతో పవన్ అభిమానులు అతడి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత రెండో సారి ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ఫ్యామిలీ విషయంలో కూడా తలదూర్చాడాని.. పోసానిపై దాడి చేసేందుకు కూడా పవన్ అభిమానులు వెనుకాడలేదు. కనిపిస్తే.. తీవ్రంగా కొట్టడానికైనా చూశారు.
దాని తర్వాత పవన్ అభిమానులపై పోసాని కేసు నమోదు చేస్తానంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు పోసానిపై కేసు నమోదు చేశాడు. వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి తానకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన కార్యకర్త అయిన రాజశేఖర్ ఈ ఫిర్యాదు చేశాడు.
వైకాపా కార్యకర్తలు తనను అవమానించారని.. పోసాని వ్యాఖ్యల తర్వాత ఇక్కడ తాము పవన్ అభిమానులమంటూ చెప్పుకొనే పరిస్థితి లేకుండా అయిందని అతడు వాపోయాడు. అతడి వ్యాఖ్యల వల్ల నాకు ప్రాణ హాని ఉందంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. ఇటు పవన్ అభిమానుల నుంచి కూడా తనకు అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…