ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే తాళం వేసి పోవడం అనేది సహజం. చుట్టు పక్కల వవరూ గమనించకుండా ఉంటే.. ఏ దొంగ అయినా ఇంట్లో దొంగతనానికి వస్తాడు. ఇలా వచ్చి.. తాళం పగల కొట్టి ఇంట్లో విలువైన వస్తువలు లేదా డబ్బులు, నగలు పట్టుకొని వెళ్తాడు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారి నివాసంలోకి చొరబడిన ఓ దొంగ..తాను ఊహించిన మొత్తంలో నగదు, ఆభరణాలు లభించకపోవడంతో నిరాశ చెందాడు.
దీంతో అక్కడ ఓ లేఖను రాసిపెట్టి వెళ్లాడు. ఆలేఖలో ఏముందో తెలుసా.. ఇంట్లో రూపాయి కూడా లేదు.. అలాంటి దానికి ఇంటికి తాళం ఎందుకు వేశావ్ అంటూ రాశాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని సివిల్ లైన్స్లోని త్రిలోచన్ గౌర్ బంగ్లాలో ఓ కలెక్టర్ నివాసం ఉంటున్నాడు.
అతడి ఇంట్లో కొద్ది రోజుల కిందట దొంగతనం జరిగింది. ఆ ఇంటిలో గత 15-20 రోజుల నుంచి లేరు. రూ. 30 వేలు, బంగారు ఆభరణాలు దొంగల అపహరించారు. ఇక ఇంట్లో డబ్బులు లేనప్పుడు తాళం ఎందుకు వేయడం.. కలెక్టర్ అని ఓ చిటీపై రాసి దొంగలు వెళ్లిపోయారు. ఖాటేగావ్ ఎస్డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న త్రిలోచన్ గౌర్.. రెండు రోజుల కిందట వచ్చిన ఆయన తన నివాసంలో దొంగతనం జరిగినట్టు గుర్తించారు.
ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండగా.. కొంత నగదు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడే అతడి ఓ లేఖ దొరికింది. అందులో ఇంట్లో డబ్బులు లేకపోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు? అని కలెక్టర్ ను ప్రశ్నించినట్లు రాసి ఉంది. దీనిని కూడా పోలీసులకు చూపించాడు కలెక్టర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…