Tag Archives: Mani Ratnam

Sriya Reddy: అమ్మ తోడు ఆ సినిమా ఏం అర్థం కాలేదు.. సలార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్?

Sriya Reddy: సలార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి శ్రియా రెడ్డి. ఈమె ఇదివరకు పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా శ్రియా రెడ్డి ఇటీవల సలార్ సినిమా ద్వారా మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రియా రెడ్డి మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తనకు ఏ మాత్రం అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేశారు.

మణిరత్నం సినిమాపై కామెంట్స్…

ఈ సినిమా ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ వెళుతుంది అనే విషయాలు నాకు అసలు అర్థం కాలేదు అంటూ శ్రియా రెడ్డి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్లపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఈమె వ్యాఖ్యలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు ఓ జి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Aishwarya: మణిరత్నంకి పాదాభివందనం చేసిన ఐశ్వర్యరాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..?

Aishwarya: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ ప్రపంచ సుందరి ఇప్పుడు ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ తాజాగా డైరెక్టర్ మణిరత్నం పాదాలకు నమస్కరించింది. సాత్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం ఎన్నో క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు.
తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా మంచి హిట్ అందుకుంది.ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా సిద్ధం చేశారు. ఈ సినిమా మొదటి భాగం గతేడాది విడుదల చేయగా..ఇక సెకండ్ పార్ట్‌ పీఎస్‌-2 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు . ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇదిలా ఉంటే, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


Aishwarya: గురు భక్తి చాటుకున్న ఐశ్వర్య…

ఐశ్వర్య రాయ్ అందరూ చూస్తుండగా మీడియా ముందు తన గురు, డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. విశ్వ సుందరిగా, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్యా రాయ్ ఇలా మణిరత్నం కాళ్లకు నమస్కరించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.