Tag Archives: mega power star ram charan

Unstoppable 2: బాలయ్య షోలో సందడి చేయనున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…. కేటీఆర్…..ఇక రచ్చ రచ్చే!

Unstoppable 2: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. గతంలో నిర్వహించిన అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. సెలెబ్రిటీలు సిల్లీ ప్రశ్నలు అడుగుతూ మరింత హుషారుగా సందడి చేస్తున్నాడు. ఈ షోలో బాలయ్య చేసే సందడి ఈ షో కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు.

ఈ సీజన్ 2 లో సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా పాల్గొని సందడి చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ టు మొదటి ఎపిసోడ్ లోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనటంతో ఈ షో రేటింగ్స్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షో లో గెస్ట్ గా రావటంతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేసిన తర్వాత యూజర్స్ ధాటికి తట్టుకోలేక ఆహా సర్వర్ డౌన్ అయిపోయిందంటేనే చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో.

ప్రభాస్ ఎపిసోడ్ తో అత్యధిక రేటింగ్స్ తో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మరొక స్టార్ హీరో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు యంగ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ కేటీఆర్ కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

Unstoppable 2: సంతోషంలో మెగా ఫ్యాన్స్…

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇలా స్టార్ హీరోతో పాటు పొలిటికల్ లీడర్ కూడా ఈ షో కి హాజరైతే అటు సినిమా, ఇటు పాలిటిక్స్.. రెండింటిని బాలయ్య ఏ రేంజ్ లో బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ షో కి హజరవటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ షో కి హాజరు కానున్నాడు అనే వార్త తెలియటంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Director Surendar Reddy : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై సంచలన కామెంట్స్ చేసిన సురేందర్ రెడ్డి…

Director Surendar Reddy :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాల్లో అగ్రహీరోగా రాణిస్తూనే… మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు మెగా తనయుడు చరణ్. అయితే తాజాగా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి – చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ధృవ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

director surendar reddy shocking comments about ram charan

అలానే సైరా నరసింహారెడ్డి చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి సురేందర్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు. సైరా నరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ బల్గేరియాలో జరిగిందని సాధారణంగా సినిమాల కోసం సెట్స్ వేస్తామని అయితే సైరా సినిమాకు పని చేసేవాళ్ల కొరకు సెట్స్ వేశామని సురేందర్ రెడ్డి తెలిపారు.

director surendar reddy shocking comments about ram charan

బల్గేరియాలో గాలి వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఎడారిలా ఉండే ఆ ప్రాంతంలో ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఉంచడం కొరకు చరణ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు బాత్ రూమ్, బెడ్ రూమ్స్ వచ్చేలా రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారని ఇందుకోసం చరణ్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని సురేందర్ రెడ్డి తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సురేందర్ రెడ్డి కామెంట్స్…

గుర్రాల కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి… చరణ్ షెడ్డు వేయించారని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో నిర్మాత ఎవరు ఇటువంటి సదుపాయాలు కల్పించాలని ఒక్క చరణ్ మాత్రమే ఒక నిర్మాతగా వీటి గురించి ఆలోచించారు అని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతుంది భవాని అలానే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ కియారా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు చరణ్.