director surendar reddy shocking comments about ram charan
Director Surendar Reddy :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాల్లో అగ్రహీరోగా రాణిస్తూనే… మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు మెగా తనయుడు చరణ్. అయితే తాజాగా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి – చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ధృవ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలానే సైరా నరసింహారెడ్డి చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి సురేందర్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు. సైరా నరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ బల్గేరియాలో జరిగిందని సాధారణంగా సినిమాల కోసం సెట్స్ వేస్తామని అయితే సైరా సినిమాకు పని చేసేవాళ్ల కొరకు సెట్స్ వేశామని సురేందర్ రెడ్డి తెలిపారు.
బల్గేరియాలో గాలి వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఎడారిలా ఉండే ఆ ప్రాంతంలో ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఉంచడం కొరకు చరణ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు బాత్ రూమ్, బెడ్ రూమ్స్ వచ్చేలా రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారని ఇందుకోసం చరణ్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని సురేందర్ రెడ్డి తెలిపారు.
గుర్రాల కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి… చరణ్ షెడ్డు వేయించారని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో నిర్మాత ఎవరు ఇటువంటి సదుపాయాలు కల్పించాలని ఒక్క చరణ్ మాత్రమే ఒక నిర్మాతగా వీటి గురించి ఆలోచించారు అని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతుంది భవాని అలానే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ కియారా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు చరణ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…