Unstoppable 2: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందింది. గతంలో నిర్వహించిన అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. సెలెబ్రిటీలు సిల్లీ ప్రశ్నలు అడుగుతూ మరింత హుషారుగా సందడి చేస్తున్నాడు. ఈ షోలో బాలయ్య చేసే సందడి ఈ షో కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు.
ఈ సీజన్ 2 లో సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా పాల్గొని సందడి చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ టు మొదటి ఎపిసోడ్ లోనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనటంతో ఈ షో రేటింగ్స్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షో లో గెస్ట్ గా రావటంతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేసిన తర్వాత యూజర్స్ ధాటికి తట్టుకోలేక ఆహా సర్వర్ డౌన్ అయిపోయిందంటేనే చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో.
ప్రభాస్ ఎపిసోడ్ తో అత్యధిక రేటింగ్స్ తో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మరొక స్టార్ హీరో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 2 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు యంగ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ కేటీఆర్ కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇలా స్టార్ హీరోతో పాటు పొలిటికల్ లీడర్ కూడా ఈ షో కి హాజరైతే అటు సినిమా, ఇటు పాలిటిక్స్.. రెండింటిని బాలయ్య ఏ రేంజ్ లో బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ షో కి హజరవటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ షో కి హాజరు కానున్నాడు అనే వార్త తెలియటంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…