Actress Praveena: సాధారణంగా కొంతమంది దుర్మార్గులు డబ్బు సంపాదించడానికి అనేక చెడు మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రజలలో మంచి పాపులారిటీ ఉండటం వల్ల వారిని టార్గెట్ చేసి వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సినిమా, సీరియల్ నటీమణులు ఇలాంటి సంఘటనల ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇలా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా కొన్ని వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి వారిని బెదిరించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి కుటుంబంలో గొడవలు మొదలవటమే కాకుండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డబ్బు కోసం ఆశపడి ఒక నీచుడు చేసిన పనికి ప్రముఖ తమిళ సీరియల్ నటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ‘‘రాజారాణి’’ సీరియల్ ద్వారా ప్రవీణా నాయర్ తమిళంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ రావడంతో మరికొన్ని సీరియల్స్లో నటించే అవకాశం కూడా అందుకుంది. ఇలా బాగా పాపులర్ అయిన ప్రవీణా నాయర్ కి సంబంధించిన ఫోటోలను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే యువకుడు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం గుర్తించిన ప్రవీణ నాయర్ పోలీసులను ఆశ్రయించి ఆ యువకుడికు జైలు శిక్ష పడేలా చేసింది. కొంతకాలం జైలులో శిక్ష అనుభవించిన ఆ నీచుడు బెయిల్ మీద బయటికి వచ్చాడు.
బయటకు వచ్చిన అతడు ప్రవీనా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఫోటోలతో పాటు ఆమె కూతురు ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా ఆమె మరదలు ఫోటోలను కూడా ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం ప్రవీణా నాయర్ గుర్తించింది. దీంతో ఆమె తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి గతంలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తే ఈ సారి తన కూతుర్ని టార్గెట్ చేశాడని, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
డెన్మార్క్లో జరుగుతున్న ఉబెర్ కప్లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు తన ఆటతో పాటు మరో కారణంతో కూడా…
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి లయ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంపై పలు…
రోజువారీ వంటలో మనం చిన్నగా భావించి పారబోసే కొన్ని విషయాల్లో కూడా ఉపయోగకరమైన విలువ దాగి ఉంటుంది. వాటిలో ఒకటి…
వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి…
రోహిణి కార్తె వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన చాలామందిలో ఉంటుంది. ఎండలు మామూలుగా కాకుండా…
దో తరగతి ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ భయం కొన్ని సందర్భాల్లో తీవ్ర…