Tag Archives: mobile phone

Rajamouli: మొదటిసారి కమర్షియల్ యాడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి… వైరల్ అవుతున్న వీడియో?

Rajamouli: దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి పేరు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయనకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయనుకున్నటువంటి ఈ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని ప్రముఖ కంపెనీలు చూస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన కూడా పలు కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇప్పటివరకు పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన రాజమౌళి మొదటిసారి ఒక కమర్షియల్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోలో రాజమౌళి సూట్ వేసి అదరగొట్టేశాడు. స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ హంగామా చేశారు. ఐతే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా ఒప్పో కంపెనీ ఫోన్ కోసం రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఈ మొబైల్ ఫోన్ ను ప్రమోట్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.

Rajamouli: మొబైల్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్ గా జక్కన్న..


ఈ వీడియోలో రాజమౌళి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో హీరోలకు ఏమాత్రం తీసుపోరు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడంతో ఈయన పేరు మారుమోగిపోతుంది. అయితే ఈయన ఈ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నారని తెలుస్తుంది.

మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న చార్జీలు..?

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు డేటా కోసం, ఇతర కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉండటంతో టెలీకం కంపెనీలకు లాభం చేకూరుతోంది.

అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జియో రాకతో టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కస్టమర్లకు కాల్స్ ఛార్జీలు, డేటా ఛార్జీలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే మొదట్లో తక్కువ ధరలకే సర్వీసులు అందించిన జియో తర్వాత కాలంలో కాల్, డేటా ఛార్జీలను పెంచింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కంపెనీలు త్వరలోనే మరోసారి ఛార్జీలను పెంచనున్నాయి.

మొబైల్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2021 జనవరి నెల నుంచి టారిఫ్ చార్జీలు 15 నుంకి 20 శాం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జియో మినహా మిగతా కంపెనీలన్నీ పెంచవచ్చని..అయితే జియో టారిఫ్ ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నెలలో మొబైల్ కంపెనీలు టారిఫ్ చార్జీలను భారీగా పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ ‌టెల్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఛార్జీల పెంపు అమలైతే వినియోగదారులు తీవంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.