Featured

మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న చార్జీలు..?

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు డేటా కోసం, ఇతర కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉండటంతో టెలీకం కంపెనీలకు లాభం చేకూరుతోంది.

అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జియో రాకతో టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కస్టమర్లకు కాల్స్ ఛార్జీలు, డేటా ఛార్జీలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే మొదట్లో తక్కువ ధరలకే సర్వీసులు అందించిన జియో తర్వాత కాలంలో కాల్, డేటా ఛార్జీలను పెంచింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కంపెనీలు త్వరలోనే మరోసారి ఛార్జీలను పెంచనున్నాయి.

మొబైల్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2021 జనవరి నెల నుంచి టారిఫ్ చార్జీలు 15 నుంకి 20 శాం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జియో మినహా మిగతా కంపెనీలన్నీ పెంచవచ్చని..అయితే జియో టారిఫ్ ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నెలలో మొబైల్ కంపెనీలు టారిఫ్ చార్జీలను భారీగా పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ ‌టెల్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఛార్జీల పెంపు అమలైతే వినియోగదారులు తీవంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago