Tag Archives: movie theaters

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

Shyam Singha Roy: రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాన్ చేసని వ్యాఖ్యలపై అప్పుడు రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అతడు టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి సపోర్టుగా నానీ కూడా మాట్లాడటం విశేషం. ఈ వివాదం కారణంగానే టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారిపోయింది.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ దాఖలు చేసింది.

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

ఈ వివాదంపై ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు స్పందించి.. వారి వారి వెర్షన్ వినిపించారు. మరో సారి నానీ కూడా తనదైన శైలిలో టికెట్ల వ్యవహారంపై విరుచుకుపడ్డాడు. రేపు నానీ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో నానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై స్పందించాడు. ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని ఆకస్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

థియేటర్ అంటే.. 10 మందికి ఉపాధి కల్పిస్తుంది.. దీని కంటే కూడా థియేటర్ పక్కన కిరాణ కొట్టు పెట్టి అమ్ముకునే వాటికి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయని అన్నాడు. టికెట్ ధరలను పెంచినా.. వాటిని కొని చూసే సామర్థ్యం ప్రేక్షకుల దగ్గర ఉందని అన్నాడు. ప్రభుత్వం కావాలనే వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం తాను ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెబుతూనే.. ఉదాహరణలు చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు కానీ… థియేటర్ల పై ఆంక్షలు విధిస్తారు: నాని

కరోనా కారణం వల్ల మూతబడిన థియేటర్లపై థియేటర్లలో పెట్టిన ఆంక్షల గురించి నటుడు నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలపై అధిక భారంగా ఉన్నటువంటి నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వాటికి పరిష్కార మార్గం ఆలోచించకుండా థియేటర్లపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ తాజాగా “తిమ్మరుసు”ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది ఒక కల్చర్. ఒక వ్యక్తి ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు సినిమాను చూడగలిగేది అంటే థియేటర్లో మాత్రమేనని నాని తెలిపారు.సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూడటం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని నాని విమర్శించారు. సాధారణంగా రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ తో పోలిస్తే థియేటర్లు ఎంతో సేఫ్ అని, కానీ కరోనా నిబంధనల పేరిట అన్నిటికంటే ముందుగా థియేటర్లను మూసేయమని అన్నిటికంటే చివరిగా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తున్నారు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనదేశంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లపై ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల ఎన్నో లక్షల మంది బతుకుల పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని,పరిస్థితులు ఇలాగే కొనసాగితూ వెళ్తే థియేటర్ అనే ఒక వ్యవస్థ నాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్రమంలోనే సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిమ్మరుసు”చిత్రాన్ని ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను జూలై 26న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని పాల్గొని తనదైన శైలిలో తన భావాలను వ్యక్తపరిచారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న క్రైమ్, థ్రిల్లర్ చిత్రంలో సత్యదేవ్ సరసన
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది.

అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల.. ఇకపై అక్కడ కరోనా యాడ్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో వైరస్ ను ఎలా కట్టడి చేయాలో తెలియక కేంద్రం దేశావ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. రెండున్నర నెలలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేసినా దేశంలో కరోనా కేసులను కట్టడి చేయడంలో కేంద్రం సక్సెస్ కాలేదు. లాక్ డౌన్ నిబంధనల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వచ్చింది.

జూన్ నెల నుంచి అన్ లాక్ 1.0 సడలింపులు మొదలు కాగా కొన్ని రోజుల క్రితం కేంద్రం. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలంతా గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాల వల్ల దాదాపు ప్రజల జీవనం సాధారణ స్థితికి చేరుకుందనే చెప్పాలి.

రాష్ట్రంలోని ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా వాడాలని జగన్ సర్కార్ పేర్కొంది. షాపింగ్ మాల్స్, షాపులు, సినిమా థియేటర్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. ప్రార్థనా మందిరాల్లో, ప్రజా రవాణాలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని తెలిపింది. షాపింగ్ మాల్స్‌, థియేటర్లలో మాస్క్ లేకపోతే అనుమతులు ఇవ్వరాదని సూచనలు చేసింది.

ప్రత్యేక అధికారుల నియామకం ద్వారా కరోనా నిబంధనలు రాష్ట్రంలో అమలయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపింది. సినిమా హాళ్లలో కరోనా యాడ్ ప్రసారం కావాలని వెల్లడించింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ల ద్వారా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. పరిశ్రమలు, విద్యా సంస్థల్లో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని వెల్లడించింది.