Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!
Prabhas-Radhe Shyam: బాహుబలి, సాహో చిత్రాలతో ఆలిండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన కొత్త సినిమా రాధేశ్యాంతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న రాధేశ్యాంపై అన్ని ఇండస్ట్రీల్లో అంచానాలు తారాస్థాయికి చేరాయి.
ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. రాధేశ్యాం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రాధేశ్యాంలో పూర్తి లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు.
తాజాగా రాధేశ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించనున్నారు. గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. దీని కోసం రామోజీ ఫిలీం సిటి అందంగా ముస్తాబవుతోంది. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈసినిమా కోసం పీరియాడిక్ లుక్ వచ్చేలా సెట్ వేస్తున్నారు. దీనికి హోస్ట్ గా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నట్లు సమాచారం.
జాతి రత్నాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో జాతి రత్నాల ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ కూడా హెల్ప్ అయ్యారు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాకు జాతి రత్నాలు స్టార్ నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…