Prabhas-Radhe Shyam: బాహుబలి, సాహో చిత్రాలతో ఆలిండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన కొత్త సినిమా రాధేశ్యాంతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న రాధేశ్యాంపై అన్ని ఇండస్ట్రీల్లో అంచానాలు తారాస్థాయికి చేరాయి.

ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. రాధేశ్యాం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రాధేశ్యాంలో పూర్తి లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు.
Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!
తాజాగా రాధేశ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించనున్నారు. గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. దీని కోసం రామోజీ ఫిలీం సిటి అందంగా ముస్తాబవుతోంది. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈసినిమా కోసం పీరియాడిక్ లుక్ వచ్చేలా సెట్ వేస్తున్నారు. దీనికి హోస్ట్ గా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నట్లు సమాచారం.

జాతి రత్నాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో జాతి రత్నాల ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ కూడా హెల్ప్ అయ్యారు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాకు జాతి రత్నాలు స్టార్ నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.






























