కరోనా కారణం వల్ల మూతబడిన థియేటర్లపై థియేటర్లలో పెట్టిన ఆంక్షల గురించి నటుడు నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలపై అధిక భారంగా ఉన్నటువంటి నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వాటికి పరిష్కార మార్గం ఆలోచించకుండా థియేటర్లపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ తాజాగా “తిమ్మరుసు”ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది ఒక కల్చర్. ఒక వ్యక్తి ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు సినిమాను చూడగలిగేది అంటే థియేటర్లో మాత్రమేనని నాని తెలిపారు.సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూడటం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని నాని విమర్శించారు. సాధారణంగా రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ తో పోలిస్తే థియేటర్లు ఎంతో సేఫ్ అని, కానీ కరోనా నిబంధనల పేరిట అన్నిటికంటే ముందుగా థియేటర్లను మూసేయమని అన్నిటికంటే చివరిగా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తున్నారు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనదేశంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లపై ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల ఎన్నో లక్షల మంది బతుకుల పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని,పరిస్థితులు ఇలాగే కొనసాగితూ వెళ్తే థియేటర్ అనే ఒక వ్యవస్థ నాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ క్రమంలోనే సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిమ్మరుసు”చిత్రాన్ని ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను జూలై 26న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని పాల్గొని తనదైన శైలిలో తన భావాలను వ్యక్తపరిచారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న క్రైమ్, థ్రిల్లర్ చిత్రంలో సత్యదేవ్ సరసన
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…