Tag Archives: Multistarres movie

కొరటాల శివ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ గా చిత్రంగా రాబోతున్న బాలయ్య.. మరొక హీరో ఎవరంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేసిన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరో మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

కొరటాల శివ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో ఆలోచించకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఇందులో బాలకృష్ణతో పాటు నటించే మరొక హీరో ఎవరనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఈ మల్టీస్టారర్ చిత్రం గురించి త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

ఏఎన్ఆర్ మల్టీస్టారర్ సినిమా వద్దన్నా చేశారు.. చివరకు ఇలా జరిగింది..

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే.. అది అభిమానుల్లో ఎక్కువ అంచనాలకు తీసుకెళ్తుంది. మొదట్లో ఇలా మల్టీస్టారర్ సినిమాలు బాగానే వచ్చాయి. సీనియర్ హీరోలల్లో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఎన్నో సినిమాలను ఇలా మల్టీస్టారర్ గా చేశారు. అంతేకాకుండా విజయాలను కూడా అందుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జునతో కలిసి ఏఎన్ఆర్ సినిమాలలో నటించారు. శివ సినిమాతో నాగార్జున అప్పట్లో ఓ ట్రెండ్ ను సెట్ చేశారు. ఆ తర్వాత నాగార్జున నటించే సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఏఎన్నార్ తో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ గా చేస్తే ఎలా ఉంటుందని శివ సినిమా నిర్మాతలు భావించారు. ఇలా వారిద్దరు కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు వంటి సినిమాలు తీశారు.

తర్వాత మళ్లీ మూడో సారి వారిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని పలువురు నిర్మాతలు భావించారు. అయితే ప్రతీసారి ఇలాంటి ప్రయోగాలు విజయాన్ని అందుకోలేవని.. చాలామంది ఈ మల్టీస్టారర్ తీయకపోవడమే మంచిదని సలహాలు ఇచ్చినప్పటికీ ఏఎన్ఆర్ మాత్రం నాగార్జునతో కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఇద్దరూ ఇద్దరే” అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఈ సినిమాలో నాగేశ్వరరావు మంచివాడి పాత్రలో.. నాగార్జున చెడ్డవాడిగా నటించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయింది. దీనిని నాగార్జున అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా కోదండరామిరెడ్డి ప్రయోగం ఫలించలేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాలో ఒకే ఒక్క పాట హైలెట్ గా నిలిచింది. ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా.. అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.