నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేసిన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరో మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
కొరటాల శివ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో ఆలోచించకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఇందులో బాలకృష్ణతో పాటు నటించే మరొక హీరో ఎవరనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఈ మల్టీస్టారర్ చిత్రం గురించి త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…