నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేసిన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరో మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
కొరటాల శివ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో ఆలోచించకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఇందులో బాలకృష్ణతో పాటు నటించే మరొక హీరో ఎవరనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఈ మల్టీస్టారర్ చిత్రం గురించి త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…