Tag Archives: online classes

ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలోకి రూ.500 జమ.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి అధికమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వారాంతపు లాక్ డౌన్ లోడ్ అమలుచేసే కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. కరోనా ఉధృతి అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలు మూతబడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పాఠశాలల యజమానులు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నారు.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్కూలు తెరచుకొనే అవకాశాలు కనిపించడం లేదు.త్వరలోనే స్కూలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది కూడా ఆన్లైన్ ద్వారానే తరగతులు నిర్వహించే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించడంతో ఎంతో మందికి ఇంటర్నెట్ సమస్యలు వేధిస్తోంది.

చాలా మంది తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్(NMMC) కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంటర్నెట్ రీఛార్జ్ కోసం ప్రతి ఒక్క విద్యార్థి పేరెంట్స్ ఖాతాలోకి రూ.500 అందించాలని నిర్ణయించుకుంది.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చదివే సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఐదు వందల రూపాయలు జమ చేయడం ద్వారా మూడు నెలలకు సరిపడా ఇంటర్నెట్ రీచార్జ్ చేసుకొని తరగతులకు హాజరు కావచ్చని మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య అధికారి అభిజిత్ తెలిపారు. 40 వేల మంది విద్యార్థులు సుమారు 16 వందల మందికి స్మార్ట్ ఫోన్లు కూడా లేవు అనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అభిజిత్ తెలియజేశారు.

విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రోజుకు 2జీబీ ఫ్రీ ఇంటర్నెట్..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో ఆఫ్ లైన్ క్లాసులంటే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు బోధన జరిగేలా చేస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత దేశంలో గతంతో పోల్చి చూస్తే ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులు మొబైల్ డేటా కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి సమయంలో తమిళనాడు సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వేర్వేరు కాలేజీలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో సీఎం పళనిస్వామి విద్యార్థులకు ఉచిత డేటా కార్డు ఇస్తామని ప్రకటించారు.

విద్యార్థులు ఆన్ లైన్ తరగతులను వినేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పళనిస్వామి చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు విద్యార్థులకు రోజుకు 2జీబీ చొప్పున ఉచితంగా డేటా అందనుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ఈ డేటా కార్డులను అందజేయనుందని తెలుస్తోంది.

ఇంటర్నెట్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల పేద విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయం తమిళనాడు సర్కార్ దృష్టికి రావడంతో సీఎం పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విద్యార్థులకు అలర్ట్.. మార్చి 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే పాఠశాలలు తెరిచే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మార్చి నెల 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అధికారులతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో స్కూల్స్ బంద్ కొనసాగినా 10, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం యథాతథంగా క్లాసులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఐదు, ఎనిమిది తరగతుల బోర్డు పరీక్షలు జరిగేవి.

అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆ పరీక్షలను కూడా రద్దు చేయడం గమనార్హం. అయితే తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు రెండు రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 2021 ఏప్రిల్‌ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మధ్యప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ కోసం ట్యాబ్లెట్లు..?

కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పోల్చి చూస్తే విద్యారంగంపై అధికంగా పడింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విజృంభణ వల్ల స్కూళ్లను తెరవడంపై ఆంక్షలు విధించడంతో ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. అయితే చాలామంది పిల్లలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు లేక చదువుకు దూరమవుతున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాల పిల్లలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా హర్యానా ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 8 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితం ట్యాబ్లెట్లను ఇవ్వనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్‌ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హర్యానా రాష్ట్రంలో డిసెంబర్ 10వ తేదీన స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

మొదట హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న స్కూళ్లు ఓపెనింగ్ చేయాలని భావిస్తోంది. అయితే మొదట్లో నవంబర్ 30నే స్కూళ్లను ఓపెన్ చేయాలని అనుకున్నా రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు దూరం కాకూడదని భావించి ప్రభుత్వం ట్యాబ్లెట్ల పంపిణీ చేపడుతోంది.

విద్యార్థులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేయడం ద్వారా విద్యార్థులకు విద్యకు దూరం కారని.. యాక్టివ్ గా క్లాసుల్లో పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరిచే విషయంలో హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలను అనుసరించనుందని తెలుస్తోంది.