దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే పాఠశాలలు తెరిచే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మార్చి నెల 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధికారులతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో స్కూల్స్ బంద్ కొనసాగినా 10, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం యథాతథంగా క్లాసులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఐదు, ఎనిమిది తరగతుల బోర్డు పరీక్షలు జరిగేవి.
అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆ పరీక్షలను కూడా రద్దు చేయడం గమనార్హం. అయితే తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు రెండు రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 2021 ఏప్రిల్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మధ్యప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు.…
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…