తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పంటలు సాగు చేసినా, చేయకపోయినా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కోటీ 45 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించింది. రబీ సీజన్ రెండు నెలల క్రితమే ప్రారంభమైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధం కాలేదు.
మరికొన్ని రోజుల్లో 2020 ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎకరాకు 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ అమలు కోసం ఏకంగా 7,251 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడు కూడా అంతే మొత్తం నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం.
గత ఏడాది అందాల్సిన రైతుబంధు సాయం ఈ సంవత్సరం జనవరి మొదటి వారంలో జమైంది. గత రెండు నెలలుగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష అనంతరం రైతుబంధు నిధులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 65.70 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించినా సాయం మాత్రం విస్తీర్ణం మొత్తానికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతుబంధు స్కీమ్ ద్వారా అందుతున్న సహాయం రైతులకు పెట్టుబడి సాయంగా పనికి వస్తోంది. విత్తనాలు, పురుగుమందుల కోసం వెచ్చించే ఖర్చులు రైతులపై భారాన్ని కొంతవరకు తగ్గిసున్నాయి. రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…