Tag Archives: Paruchuri venkateswara Rao

Paruchuri Gopalakrishna: అన్నయ్య కారణంగా 100 ఎకరాల ఆస్తులు పోగొట్టుకున్నా: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరుచూరి బ్రదర్స్ చేసినటువంటి సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరు దాదాపు 300 సినిమాలకు కథలను అందించి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.అయితే వీరిద్దరూ రచయితలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా నటులుగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

ఇక ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకి వయసు పై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ గోపాలకృష్ణ మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి విశ్లేషణ ఇస్తూ వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గోపాలకృష్ణ తాను ఆస్తులు కోల్పోవడం గురించి తెలియజేశారు.

శోభన్ బాబు హీరోగా తాను ఒక సినిమాకు దర్శకత్వం వహించానని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామానాయుడు సురేష్ బాబు గారు ఈ సినిమా పక్క హిట్ అవుతుందని చెప్పారు. వారు చెప్పిన విధంగానే సినిమా చాలా మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇతర నిర్మాతలు తన వద్ద డబ్బులు కట్టలు ముందు పెట్టి తమ బ్యానర్లో సినిమా చేయాలని కోరారు.

Paruchuri Gopalakrishna నోట్ల కట్లు ముందున్న తీసుకోలేదు..


ఇలా నోట్ల కట్టలు నా ముందు ఉన్నప్పటికీ నేను వాటిని తీసుకోలేదు. అప్పటికి సురేష్ బాబు మీరు ఈ డబ్బు తీసుకోండి శంకరంపల్లిలో భూమి కొందామని చెప్పినప్పటికీ అన్నయ్య మాత్రం ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు.వాడు దర్శకుడు అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అంటూ మాట్లాడారు. అలా అన్నయ్యకు ఇష్టం లేకుండా నేను ఆ డబ్బును తీసుకోలేదు. ఆ రోజు కనుక ఆ డబ్బు తీసుకొని ఉంటే శంకరంపల్లిలో 100 ఎకరాల ఆస్తి నా సొంతం అయ్యేది. అప్పట్లో ఎకరం 10000 మాత్రమేనని ఈ సందర్భంగా గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Paruchuri venkateswara Rao: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. వైరల్ అవుతున్న ఫోటో!

Paruchuri venkateswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితలుగా దర్శకులుగా, నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. ఇక పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైనటువంటి పరుచూరి వెంకటేశ్వర రావు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

పరుచూరి గోపాలకృష్ణ తరచూ సినిమాల గురించి విశ్లేషణ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కాగా వెంకటేశ్వరరావు మాత్రం వయసు పై పడటంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందుకు కూడ రాలేదు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు సందర్భంగా సీనియర్ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో పలువురు సీనియర్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయగా ఇతనిని చూసినటువంటి అభిమానులు అసలేంటి గుర్తుపట్టలేని విధంగా వెంకటేశ్వరరావు గారు మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన మరొకరి సహాయంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

Paruchuri venkateswara Rao: నడవలేని స్థితిలో పరుచూరి వెంకటేశ్వరరావు…

ఈ విధంగా పరుచూరి వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ కమెడియన్ కోట శ్రీనివాసరావు సైతం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే కోటా శ్రీనివాస ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఇద్దరి సహాయంతో ఈ కార్యక్రమంలో కనిపించారు. మొత్తానికి ఈ సెలబ్రిటీలందరికీ వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారనే చెప్పాలి.