Paruchuri Gopalakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరుచూరి బ్రదర్స్ చేసినటువంటి సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరు దాదాపు 300 సినిమాలకు కథలను అందించి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.అయితే వీరిద్దరూ రచయితలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా నటులుగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.
ఇక ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకి వయసు పై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ గోపాలకృష్ణ మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి విశ్లేషణ ఇస్తూ వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గోపాలకృష్ణ తాను ఆస్తులు కోల్పోవడం గురించి తెలియజేశారు.
శోభన్ బాబు హీరోగా తాను ఒక సినిమాకు దర్శకత్వం వహించానని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామానాయుడు సురేష్ బాబు గారు ఈ సినిమా పక్క హిట్ అవుతుందని చెప్పారు. వారు చెప్పిన విధంగానే సినిమా చాలా మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇతర నిర్మాతలు తన వద్ద డబ్బులు కట్టలు ముందు పెట్టి తమ బ్యానర్లో సినిమా చేయాలని కోరారు.
ఇలా నోట్ల కట్టలు నా ముందు ఉన్నప్పటికీ నేను వాటిని తీసుకోలేదు. అప్పటికి సురేష్ బాబు మీరు ఈ డబ్బు తీసుకోండి శంకరంపల్లిలో భూమి కొందామని చెప్పినప్పటికీ అన్నయ్య మాత్రం ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు.వాడు దర్శకుడు అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అంటూ మాట్లాడారు. అలా అన్నయ్యకు ఇష్టం లేకుండా నేను ఆ డబ్బును తీసుకోలేదు. ఆ రోజు కనుక ఆ డబ్బు తీసుకొని ఉంటే శంకరంపల్లిలో 100 ఎకరాల ఆస్తి నా సొంతం అయ్యేది. అప్పట్లో ఎకరం 10000 మాత్రమేనని ఈ సందర్భంగా గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…