Paruchuri venkateswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితలుగా దర్శకులుగా, నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. ఇక పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైనటువంటి పరుచూరి వెంకటేశ్వర రావు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
పరుచూరి గోపాలకృష్ణ తరచూ సినిమాల గురించి విశ్లేషణ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కాగా వెంకటేశ్వరరావు మాత్రం వయసు పై పడటంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందుకు కూడ రాలేదు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు సందర్భంగా సీనియర్ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో పలువురు సీనియర్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయగా ఇతనిని చూసినటువంటి అభిమానులు అసలేంటి గుర్తుపట్టలేని విధంగా వెంకటేశ్వరరావు గారు మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన మరొకరి సహాయంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ విధంగా పరుచూరి వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ కమెడియన్ కోట శ్రీనివాసరావు సైతం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే కోటా శ్రీనివాస ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఇద్దరి సహాయంతో ఈ కార్యక్రమంలో కనిపించారు. మొత్తానికి ఈ సెలబ్రిటీలందరికీ వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారనే చెప్పాలి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…
సినిమాల్లో యాంగ్రీమ్యాన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో…