Paruchuri venkateswara Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితలుగా దర్శకులుగా, నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. ఇక పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైనటువంటి పరుచూరి వెంకటేశ్వర రావు ఈ మధ్యకాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
పరుచూరి గోపాలకృష్ణ తరచూ సినిమాల గురించి విశ్లేషణ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర కాగా వెంకటేశ్వరరావు మాత్రం వయసు పై పడటంతో ఈయన పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందుకు కూడ రాలేదు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు సందర్భంగా సీనియర్ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో పలువురు సీనియర్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు సైతం ఈ కార్యక్రమంలో సందడి చేయగా ఇతనిని చూసినటువంటి అభిమానులు అసలేంటి గుర్తుపట్టలేని విధంగా వెంకటేశ్వరరావు గారు మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన మరొకరి సహాయంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ విధంగా పరుచూరి వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ కమెడియన్ కోట శ్రీనివాసరావు సైతం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే కోటా శ్రీనివాస ఈ మధ్య పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఇద్దరి సహాయంతో ఈ కార్యక్రమంలో కనిపించారు. మొత్తానికి ఈ సెలబ్రిటీలందరికీ వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…