Tag Archives: people

కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేద్దామని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం శాస్త్రవేత్తలు, వైద్యులకు భారీ షాక్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా తమకు వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

దేశంలో ఏకంగా 61 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దేశంలోని ప్రజల్లో కరోనా వైరస్ గురించి గతంతో పోలిస్తే భయం చాలా తగ్గింది. చాలామంది ప్రజలు ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా సాధారణ ఫ్లూ మాత్రమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే అధ్యయనంలో 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా వేయించుకోవడానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆన్ లైన్ లో సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 51 శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా బారిన పడకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తమను వేధించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 10 శాతం తమకు వ్యాక్సిన్ వద్దేవద్దని ఖరాఖండీగా చెబుతున్నారు. 72 శాతం పురుషులు, 54 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని సమాచారం.

కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. సర్వేలో మొత్తం 8,496 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.

నిండు ప్రాణం బలిగొన్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్… వేల మందిలో టెన్షన్..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అతిత్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న వ్యాక్సిన్లలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ కూడా ఒకటి.

అయితే ఈ వ్యాక్సిన్ ఒక నిండుప్రాణాన్ని బలిగొంది. బ్రెజిల్ వ్యాక్సిన్ తీసుకున్న ఒక వాలంటీర్ మృతి చెందినట్టు నిన్న అధికారిక ప్రకటన చేసింది. బ్రెజిల్ తో పాటు ప్రపంచ దేశాల్లో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కొదీ రోజుల క్రితం ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక వ్యక్తి బ్రిటన్ లో అనారోగ్యానికి గురి కాగా క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే ప్రస్తుతం మరోసారి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మృతి చెందాడా..? ఆ వ్యక్తి మృతికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే వాలంటీర్ మృతి చెందినా క్లినికల్ ట్రయల్స్ ఆగవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి చెందడంతో ఆ వ్యాక్సిన్ ను తీసుకున్న ఇతర వాలంటీర్లు సైతం ఆందోళనకు గురవుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ ఈ ఘటన గురించి స్పందిస్తూ వ్యాక్సిన్ భద్రత గురించి అనుమానాలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. అయితే వాలంటీర్ మృతి చెందినంత మాత్రాన ప్రయోగాలు నిలిపివేయాల్సిన అవసరం ఐతే ప్రస్తుతానికి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లకు షాకింగ్ న్యూస్..?

గడిచిన ఏడు నెలలుగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతోంది. ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన వాళ్లిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి వాళ్లలో కొందరు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల్లో 7 నుంచి 8 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా రోగులతో పోల్చి చూస్తే వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డ కట్టే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోందని కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ వచ్చిన వాళ్లు మూడు నెలల పాటు యాంటీ కో ఆగ్యుగేషన్ మందులను వాడాలని సూచనలు చేస్తున్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తే వాటి ఫాలో అప్ మందులను వాడాలని చెబుతున్నారు.

మెడిటేషన్, యోగా, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. యోగా, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.