Featured

కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేద్దామని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం శాస్త్రవేత్తలు, వైద్యులకు భారీ షాక్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా తమకు వ్యాక్సిన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

దేశంలో ఏకంగా 61 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దేశంలోని ప్రజల్లో కరోనా వైరస్ గురించి గతంతో పోలిస్తే భయం చాలా తగ్గింది. చాలామంది ప్రజలు ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా సాధారణ ఫ్లూ మాత్రమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే అధ్యయనంలో 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా వేయించుకోవడానికి తాము సిద్ధంగా లేమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆన్ లైన్ లో సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 51 శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా బారిన పడకపోయినా ఇతర ఆరోగ్య సమస్యలు తమను వేధించే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. 10 శాతం తమకు వ్యాక్సిన్ వద్దేవద్దని ఖరాఖండీగా చెబుతున్నారు. 72 శాతం పురుషులు, 54 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని సమాచారం.

కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. సర్వేలో మొత్తం 8,496 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago