గడిచిన ఏడు నెలలుగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతోంది. ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన వాళ్లిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి వాళ్లలో కొందరు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల్లో 7 నుంచి 8 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా రోగులతో పోల్చి చూస్తే వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డ కట్టే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోందని కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ వచ్చిన వాళ్లు మూడు నెలల పాటు యాంటీ కో ఆగ్యుగేషన్ మందులను వాడాలని సూచనలు చేస్తున్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తే వాటి ఫాలో అప్ మందులను వాడాలని చెబుతున్నారు.
మెడిటేషన్, యోగా, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. యోగా, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…