గడిచిన ఏడు నెలలుగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతోంది. ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన వాళ్లిన షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి వాళ్లలో కొందరు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల్లో 7 నుంచి 8 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ కరోనా రోగులతో పోల్చి చూస్తే వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల రక్తనాళాలు గడ్డ కట్టే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోందని కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా సోకి నెగిటివ్ వచ్చిన వాళ్లు మూడు నెలల పాటు యాంటీ కో ఆగ్యుగేషన్ మందులను వాడాలని సూచనలు చేస్తున్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ను ఉపయోగిస్తే వాటి ఫాలో అప్ మందులను వాడాలని చెబుతున్నారు.
మెడిటేషన్, యోగా, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. యోగా, మెడిటేషన్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను తరచూ పరిశీలించుకుంటూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…