ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థినులకు ఉచితంగా శిక్షణతో [పాటు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. శిక్షణ అనంతరం విద్యార్థినులకు శ్రీసిటీ లోని ఆల్స్టామ్ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన 2019 విద్యార్థినులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికయిన విద్యార్థినులకు ఫ్రీ ట్రైనింగ్ తో పాటు ఫ్రీగా హాస్టల్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.
http://engineering.apssdc.in/siemenplacements/ విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు మాత్రమే అర్హులని తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హతలు ఉన్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
ఎంపికైన విద్యార్థినులు శ్రీ సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వారికి ఆల్స్టామ్ సంస్థ, స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సర్టిఫికెట్లను అందజేస్తాయి. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వేతనంతో ఆల్స్టామ్ సంస్థ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…