Tag Archives: post is going viral

Rashmi: తెలియక తప్పు చేస్తే క్షమించండి… వైరల్ అవుతున్న రష్మీ పోస్ట్!

Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మీ కేవలం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా,ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి మొదట్లో బుల్లితెర సీరియల్ నటుడు అంబంటి అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇలా ఈయన వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమానికి రేటింగ్ రాకపోవడంతో అంబంటి అర్జున్ స్థానంలో యాంకర్ గా సుడిగాలి సుదీర్ ను నియమించారు. ఇలా సుదీర్ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు అని చెప్పాలి.

ఇక కొంతకాలం పాటు సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంతరం ఈ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు వెళ్లిపోవడంతో ఈ స్థానంలోకి రష్మీ యాంకర్ గా వచ్చారు. అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు రష్మికి విభిన్న రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Rashmi: మీ సపోర్ట్ ఉండాలి..


ఈ విధంగా అభిమానులు రష్మికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే రష్మీ సందిస్తూ ప్రతి ఆదివారం ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎంతో మంచిగా ఆదరిస్తున్నందుకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకున్నారు. అలాగే తమ నుంచి ఏదైనా తప్పు జరిగిన తమని క్షమించాలి అంటూ ఈ సందర్భంగా రష్మి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tarakaratna Wife: ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెబుతా… వైరల్ అవుతున్న తారకరత్న భార్య అలేఖ్య పోస్ట్!

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు తన భార్య అలేఖ్యరెడ్డి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. జనవరి 27వ తేదీ పాదయాత్రలో భాగంగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.

ఈ విధంగా ఈయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించడంతో ఒక్కసారిగా ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది.ఇలా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తారకరత్నతో కలిసి చివరిగా తిరుమల వెళ్ళినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ నీతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు ఒక్కసారి నీ గొంతు వినాలని ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక తారకరత్న పెద్దకర్మ తర్వాత ఈమె గత ఏడాది సందర్భంగా తన భర్త తనకు రాసినటువంటి లవ్ లెటర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.


Tarakaratna Wife: నిన్ను చాలా మిస్ అవుతున్నా…

ఇలా తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేక తరచు కంటతడి పెట్టుకుంటున్నటువంటి అలేఖ్య రెడ్డి గురించి తన పెద్ద కుమార్తె నిషిక చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే నిషిక తన తల్లి గురించి చెబుతూ అమ్మ నువ్వు చాలా బాధలో ఉన్నావు ఇంకొకసారి ఏడిస్తే నేను నీకు గుడ్ బై చెప్తా అని రాసి ఉన్నటువంటి పోస్టును అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.