Tag Archives: Praja Rajyam Party

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి తాజాగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు.గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన రోజే నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందిందని ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలియచేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలు వారి అభిమానుల గురించి కూడా మాట్లాడారు సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని తెలియజేశారు.తన సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టే వాడినని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలియజేశారు.

Chiranjeevi: ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా…

ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు కూడా చేశారు. అయితే నేనెప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishnam Raju -Chiranjeevi: స్నేహం కోసం చిరంజీవికి అండగా నిలిచిన కృష్ణంరాజు.. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు!

Krishnam Raju -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు నటుడు కృష్ణంరాజు. 1998 కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అటల్ బీహారీ వాజ్ పాయ్ హయామంలో కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. అయితే ఈయన సినీ కెరియర్ లోను రాజకీయ కెరియర్ లోను చిరంజీవితో ఎంతో సఖ్యతగా ఉండేవారు.

చిరంజీవి కృష్ణంరాజు ఇద్దరు మొగల్తూరుకు చెందిన వారే కావడంతో వీరి మధ్య ఎంతో మంచి అనుబంధ ఉంది. ఇలా కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో ఉండగా చిరంజీవి సైతం సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతూ అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు ఇకపోతే కృష్ణంరాజు 2009వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

ఈ విధంగా ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా రాజకీయాలలో చిరంజీవికి మద్దతుగా నిలబడిన ఈయన అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత తిరిగి బిజెపిలో చేరారు. బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఈయన మాత్రం రాజకీయాలలో చురుగ్గా కొనసాగలేదు.

Krishnam Raju -Chiranjeevi: మర్చిపోలేని బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు..

ఇకపోతే ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన మేనల్లుడితో కలిసి వెళ్లిన కృష్ణంరాజు అక్కడ తన మేనల్లుడు లండన్ నుంచి తెచ్చిన ఒక కెమెరాతో అక్కడికి వచ్చిన సెలబ్రిటీల ఫోటోలను తీస్తున్నారు.అది చూసిన చిరంజీవి కెమెరా ఎక్కడ కొన్నారు అన్న దీనిని నేను లండన్ లో చూశాను చాలా కాస్ట్లీ కెమెరా అంటూ అని అడగడంతో వెంటనే కృష్ణంరాజు తన మేనల్లుడి మెడలో ఉన్నటువంటి కెమెరా తీసి చిరంజీవి మెడలో వేసి నీ బర్త్డే గిఫ్ట్ ఇదేనంటూ చెప్పారు. అలా ఆరోజు కృష్ణంరాజు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేని చిరంజీవి పలుసార్లు గుర్తు చేసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.