Tag Archives: prize money

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి పేద రైతులు దొరకలేదా.. ప్రైజ్ మనీ విషయంలో మోసం చేసినట్టేనా?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణం వ్యక్తిలాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును తాను వాడుకోనని పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చారు. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పెద్దగా సహాయ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మాత్రం కనిపించలేదు దీంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ పట్ల విమర్శలు రావడంతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపై కూడా మరికొంతమంది రైతులకు తాను సహాయం చేస్తానని నేను చేసే సహాయానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటానని తెలిపారు.

డబ్బు పంచడం ఇష్టం లేదా..
ఇక ఈయన సహాయం చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు మరో వీడియో షేర్ చేయలేదు. అయితే తాను పేద రైతులను గుర్తించి వారికి మాత్రమే సహాయం చేస్తానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దకు ఎవరు కూడా సాయం చేయమని రావద్దని తానే పేదవారిని గుర్తించి సాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈయన పేదవారిని గుర్తించలేకపోతున్నారా లేకపోతే డబ్బు పంచడం ఈయనకు ఇష్టం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో రూ.కోటి గెలుచుకుంది ఎవరో తెలుసా..?

‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే ప్రోగ్రాంకు నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ ప్రోగ్రాంకు విపరీతమైన రేటింగ్ వచ్చింది. ఎంతో పాపులారిటీ కూడా తెచ్చుకుంది. ఎంతో మంది అందులో పాల్గొని నగదు బహుమతిని గెలుచుకున్నారు. దీనిలో 15 ప్రశ్నలను అడుగుతారు. ప్రతీ 5 ప్రశ్నలకు ఒకసారి సేఫ్ జోన్ కి వెళ్తారు.

ఇలా 15 ప్రశ్నలు చెప్పిన వాళ్లు రూ. కోటి గెలుచుకుంటారు. అయితే రెండో సీజన్ ఈ ప్రోగ్రాంను మెగస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. మూడో సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ సారి ఆ పేరును ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చేశాడు. అయితే ఇటీవల ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఒకరు కోటి రూపాయలు గెలుచుకున్నట్లుగా తెలిపారు.

అది ఎవరికి వరించిందో తెలుసా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్‌ మండలానికి చెందిన బి.రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్‌ రాజు–శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.

https://youtu.be/vJPb35sZCKw

ఒకటో ప్రశ్న నుంచి 14 ప్రశ్నల వరకు సమాధానం చెప్పిన తర్వాత రూ.50లక్షలతో అతడు ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నోటి వెంట రూ.కోటి ప్రశ్న అంటూ మొదటి సారి వచ్చింది. అతడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. రవీంద్ర మాట్లాడిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.