Tag Archives: PS2

Aishwarya: మణిరత్నంకి పాదాభివందనం చేసిన ఐశ్వర్యరాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..?

Aishwarya: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ ప్రపంచ సుందరి ఇప్పుడు ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ తాజాగా డైరెక్టర్ మణిరత్నం పాదాలకు నమస్కరించింది. సాత్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం ఎన్నో క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు.
తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మణిరత్నం రూపొందించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా మంచి హిట్ అందుకుంది.ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా సిద్ధం చేశారు. ఈ సినిమా మొదటి భాగం గతేడాది విడుదల చేయగా..ఇక సెకండ్ పార్ట్‌ పీఎస్‌-2 ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు . ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇదిలా ఉంటే, ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


Aishwarya: గురు భక్తి చాటుకున్న ఐశ్వర్య…

ఐశ్వర్య రాయ్ అందరూ చూస్తుండగా మీడియా ముందు తన గురు, డైరెక్టర్ మణిరత్నం కాళ్లకు నమస్కరించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. విశ్వ సుందరిగా, స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్యా రాయ్ ఇలా మణిరత్నం కాళ్లకు నమస్కరించటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vikram: 12 ఏళ్లకే యాక్సిడెంట్…4 ఏళ్లు కదలలేని పరిస్థితి.. 23 సర్జరీలు… కట్ చేస్తే స్టార్ హీరో?

Vikram: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న తనకు 12 సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు.తనకు 12 సంవత్సరాల వయసులోనే నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే ఒక సినిమాలో మూగబ్బాయి పాత్రలో నటించాను. ఈ సినిమాకు గాను తనకు ఉత్తమ బాల నటుడిగా అవార్డు వచ్చింది.

ఈ అవార్డ్ అందుకోవడం కోసం ఐఐటి మద్రాస్ కు తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యానని ఆ సమయంలో తనకుడి కాలు మొత్తం డామేజ్ అయిందని తెలిపారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో డాక్టర్స్ కాలు తొలగించాలని చెప్పారు. అయితే అందుకు తన తల్లి ఒప్పుకోలేదని విక్రమ్ వెల్లడించారు.ఇక నా కాలు బాగవ్వడానికి సుమారు నాలుగు సంవత్సరాల సమయం పట్టిందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

Vikram: నటనపై ఆసక్తి తగ్గలేదు…

ఇక ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపు 23 సర్జరీలు జరిగాయని, ఇలా మూడు సంవత్సరాలకు కోలుకున్న తర్వాత ఇంకో సంవత్సరం మెల్లిగా నడవడం ప్రారంభించామని విక్రమ్ తెలిపారు.ఇలా తనకు కాలు బాగా లేకపోయినా తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక క్రమక్రమంగా పెరిగిపోయిందంటూ ఈ సందర్భంగా విక్రమ్ తనకు జరిగిన ప్రమాదం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.