Vikram: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న తనకు 12 సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు.తనకు 12 సంవత్సరాల వయసులోనే నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే ఒక సినిమాలో మూగబ్బాయి పాత్రలో నటించాను. ఈ సినిమాకు గాను తనకు ఉత్తమ బాల నటుడిగా అవార్డు వచ్చింది.
ఈ అవార్డ్ అందుకోవడం కోసం ఐఐటి మద్రాస్ కు తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యానని ఆ సమయంలో తనకుడి కాలు మొత్తం డామేజ్ అయిందని తెలిపారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో డాక్టర్స్ కాలు తొలగించాలని చెప్పారు. అయితే అందుకు తన తల్లి ఒప్పుకోలేదని విక్రమ్ వెల్లడించారు.ఇక నా కాలు బాగవ్వడానికి సుమారు నాలుగు సంవత్సరాల సమయం పట్టిందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ఇక ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపు 23 సర్జరీలు జరిగాయని, ఇలా మూడు సంవత్సరాలకు కోలుకున్న తర్వాత ఇంకో సంవత్సరం మెల్లిగా నడవడం ప్రారంభించామని విక్రమ్ తెలిపారు.ఇలా తనకు కాలు బాగా లేకపోయినా తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక క్రమక్రమంగా పెరిగిపోయిందంటూ ఈ సందర్భంగా విక్రమ్ తనకు జరిగిన ప్రమాదం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…