Tag Archives: r narayana murthy

Narayana Murthy: సభ్యత ఉండాలిగా అంటూ యాంకర్ స్రవంతి పై సీరియస్ అయిన ఆర్ నారాయణ మూర్తి!

Narayana Murthy: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం సార్.విద్యా వ్యవస్థ పై ఓ లెక్చరర్ చేస్తున్న పోరాట నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా ధనుష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యాంకర్ స్రవంతి చొక్కారపు పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలా స్రవంతి పై నారాయణమూర్తి సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

నారాయణమూర్తి వేదిక పైకి వచ్చి ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుతూ వచ్చారు. అయితే నారాయణమూర్తి కమెడియన్ హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో ఆయన మరోసారి మైక్ తీసుకుని కమెడియన్ హైపర్ ఆది గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది గమనించని స్రవంతి వేదిక పైకి మరొకరిని ఆహ్వానించారు. దీంతో నారాయణమూర్తి ఉన్నఫలంగా స్రవంతి పై సీరియస్ అయ్యారు.

Narayana Murthy: మాట్లాడిన తర్వాతే మరొకరిని పిలవండి..

దీంతో నారాయణమూర్తి ఏ పిల్ల ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్న కాసేపు ఆగండి.మాట్లాడిన తర్వాత పిలవండి కాస్త సభ్యతతో మెలగండి అంటూ ఈయన స్రవంతి చొక్కారపుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ఇందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో ఫైరల్ గా మారింది.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

R.Narayana Murthy: ఆర్. నారాయణ మూర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ.. ప్రజల సమస్యలే సినిమా వస్తువులుగా సినిమాలు తీస్తుంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ… ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తను కోరుకుంటే.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో పనిచేసే అవకాశం ఉన్నా…డబ్బు కోసం ఏనాడు వెంపర్లాడలేని వ్యక్తిగా ఆర్ నారాయణ మూర్తి నిలుస్తారు. ఇండస్ట్రీలో తనను గౌరవించని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు.  రైతు కుటుంబంలో జన్మించిన నారాయాణ మూర్తి కాలేజ్ లో చదువుకునేపటప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పిని చేశాడు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తిండి, వసతి లేక మద్రాస్ లో ఉండేటప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఏ చదివిన నారాయణ మూర్తి స్నేహితుల సాయంతో ‘‘ అర్థ రాత్రి స్వాతంత్య్రం’’ అనే సినిమాను తెరకెక్కించాడు. 
ఇన్ని ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. కూడా తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు.

ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని…

ఎక్కడికి వెళ్లినా.. ఆటోలో, నడుచుకుంటూ  వెళ్లడం నారాయణ మూర్తి సింప్లిసిటీకి నిదర్శనం. ఇవ్వాళ ఒక్క సినిమాలోనే నటిస్తే కార్లు, బిల్డింగులు వస్తున్నాయి. కానీ దశాబ్ధాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ సొంత ఇళ్లు, కారు కూడా లేని నిరాడంబర వ్యక్తి నారాయణ మూర్తి. తనకు ఉన్న 12 ఎకరాల భూమిని దానం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నారాయణ మూర్తి తల్లి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కొడుకు ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని… హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోమని చెబితే వినలేదని ఆమె అన్నారు. ఇక నారాయణ మూర్తికి చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మని వెల్లడించారు.

R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి.. తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

R Narayana Murthy: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య టికెట్ల వివాదం ముదురుతోంది. ప్రభుత్వం టికెట్ ధరలపై వెనక్కి తగ్గకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు అసహనానికి గురువుతున్నారు. మొన్న నాని… నిన్న ఆర్. నారాయణ మూర్తి టికెట్ ధరలు, థియేటర్ల మూసివేతపై స్పందించారు. శ్యాంసింగరాయ్ సక్సెస్ మీట్ కు అతిథిగా వచ్చిన నారాయణ మూర్తి.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి.. తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

ఏపీలో థియేటర్లు మూతపడుతుంటే ఏడుపు వస్తుందన్నారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసి వేశారనే వార్త చదిపినప్పుడు ఏడుపు వస్తుందని తన బాధను వ్యక్త పరిచారు.సినిమాలు తీసేవారు, చూపించేవారు బాగున్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని తెలిపాడు. సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి కోట్ల మంది జీవిస్తున్నారని.. వీరందరిపై ప్రభావం పడుతుందని అన్నారు.

R Narayana Murthy: అయ్యో దేవుడా.. ఏమిటి ఈ పరిస్థితి..తలుచుకుంటే ఏడుపు వస్తోంది.. టికెట్ల విషయంపై స్పందించిన నారాయణమూర్తి!

ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు ఈవిషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించాలని..ఆయన కోరారు. థియేటర్ల యజమానులు థియేటర్లను మూసివేయద్దని.. ఏపీ మంత్రులను కలిసి చర్చించాలని ఆయన సూచించారు. సమస్యను ఏపీ సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

నాని వ్యాఖ్యలను తప్పుగా చూడొద్దు.. దిల్ రాజు

కాగా ఇటీవల సినినటుడు నాని చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నారాయణ మూర్తి నిలిచారు. దిల్ రాజు మాట్లాడుతూ.. నాని వ్యాఖ్యలను తప్పుగా చూడద్దని.. నాని ఎమోషనల్ గా మాట్లాడారని.. ఆయన ఓ విధంగా మాట్లాడితే.. మరో విధంగా అర్థమైందని దిల్ రాజు అన్నారు. పరిస్థితిని ప్రభుత్వానికి వివరిస్తాం అని.. అప్పటి వరకు ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ,  ట్విట్స్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ పరిస్థితిపై నాని నెగిటివ్ గా ఏం స్పందించలేదని ఆయన అన్నారు.

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇతరుల సినిమాల్లో నటించకపోడానికి కారణం ఏమిటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “నేరము -శిక్ష” సినిమా ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ఈ సినిమాతో హీరోగా మారారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఆర్ నారాయణ మూర్తి ఆ తర్వాత దర్శకుడిగా మారారు.

ఈ క్రమంలోనే నారాయణమూర్తి దర్శకత్వంలో ఆయన నటుడిగా నటిస్తూ తెరకెక్కిన చిత్రం “అర్ధరాత్రి స్వతంత్రం”. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలను నిజ జీవితానికి ఆధారంగా సామాజిక అంశాలతో, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించే వారు. ఈ విధంగా నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్రసైన్యం, భూపోరాటం, అడవి దివిటీలు, చీమలదండు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు పొందాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మంచి నటుడిగా దర్శకుడిగా కొనసాగిన ఆర్.నారాయణమూర్తి సినిమాలకు ప్రస్తుతం పెద్దగా ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు. ఈయన సినిమాలకు ఆదరణ లేకున్నప్పటికీ ఇతనికి పలు దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. కొందరి దర్శకులు వారి సినిమాలలో నారాయణమూర్తికి ప్రత్యేక పాత్రలో నటించమని అవకాశం కల్పించినప్పటికీ నారాయణమూర్తి దర్శకులకు ఎంతో సున్నితంగా సినిమాలలో నటించినని చెప్పేశారు.

నారాయణ మూర్తి కేవలం తన సినిమాలలో మాత్రమే నటించేవారు. ఇతర దర్శకులు సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్నా నటించక పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇతర దర్శకుల సినిమాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నా మనసుకు నచ్చకుండా నటించడం వల్ల ఎక్కువ సార్లు టేకులు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలాసార్లు టేకులు తీసుకున్నప్పుడు నామీద నాకే అసహ్యం కలుగుతుంది.

నాతో సినిమా తీయాలంటే “ఒమర్ ముఖ్తార్” వంటి సినిమా అయిన తీయాలి లేకపోతే శంకరాభరణం సినిమాలో జె.వి.సోమయాజులు వంటి పాత్ర అయినా ఇవ్వాలి అంతే కానీ మిగతా ఏ పాత్రలో నటించడానికి కూడా తన మనసు ఒప్పుకోదని అందుకోసమే తాను తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో తప్ప ఇతర దర్శకుల సినిమాల్లో నటించనని ఓ సందర్భంలో ఆర్. నారాయణమూర్తి తెలియజేశారు.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. ఆర్ నారాయణ మూర్తి.. ఎందుకంటే?

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వణికిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూత పడ్డాయి.ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నటువంటి ఎంతోమంది కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాతలు సినిమాలను థియేటర్లో కాకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికపై విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు బ్రతకాలంటే తప్పనిసరిగా థియేటర్లు తెరచుకోవాలి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు థియేటర్లు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లు మాత్రం ఇప్పటికీ ఓపెన్ కాలేదు. ఈ క్రమంలోనే ఒక సినిమాను నిర్మించిన నిర్మాతలు తమ సినిమా కోసం పెట్టిన డబ్బులను పొందటానికి వారి సినిమాను ఎక్కడో ఒకచోట విడుదల చేయాలి కనుక చాలామంది ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

ఈ విధంగా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికపైవిడుదల అయితే చాలామంది సాధారణ ప్రేక్షకులు సినిమాలను చూడలేకపోతున్నారు అంటూ నారాయణ మూర్తి ఓటీటీ సమస్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాధారణ ప్రేక్షకుడికి థియేటర్లో చూస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ప్రస్తుతం సినిమాలన్నీ ఓటీటీలో విడుదల అయితే ప్రేక్షకుడు ఆనందానికి కూడా దూరమవుతాడు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోవడానికి సినిమా పెద్దలు కృషిచేయాలని. సినిమాలన్నీ థియేటర్లోనే విడుదల చేస్తూ థియేటర్ వ్యవస్థను బ్రతికించాలని ఈ సందర్భంగా నారాయణమూర్తి కోరారు.

ఒకప్పుడు ఈ రెండు రిక్షాలు ఢీ కొన్నాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ పగిలిపోయింది.

ఈ నటులు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించారు. కొన్ని సంవత్సరాల తేడాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయాలను అందుకుంటే మరొకరు దాసరి దర్శకత్వంలో తెరపై కనిపించారు. ప్రాణం ఖరీదు, కోతలరాయుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించగా, నారాయణమూర్తి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చిరంజీవి పక్కన కనిపించారు.

చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1980 ప్రథమార్థంలో నారాయణమూర్తి స్నేహాచిత్ర బ్యానర్ స్థాపించి, హీరోగా నటిస్తూనే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే 1995 వచ్చేసరికి చిరంజీవి, నారాయణ మూర్తి ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. దాసరి చిత్రాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నారాయణమూర్తిని హీరోగా పెట్టి ఏకంగా ఓ సినిమానే మొదలు పెట్టడం జరిగింది.

దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “ఒరేయ్ రిక్షా” చిత్రంలో ఆర్.నారాయణమూర్తి, రవళి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో నారాయణమూర్తి కష్టపడి రిక్షానడుపుతూ.. తన గారాబాల చెల్లిని పెంచి పోషించే ఒక అన్నగా ఆర్.నారాయణమూర్తి నటించారు. 1995 నవంబర్ 9న ఒరేయ్ రిక్షా సినిమా విడుదలై బాక్సాఫీసు బరిలో సిద్ధంగా ఉంది.

ఇదే సంవత్సరంలో క్రాంతి కుమార్ నిర్మాణం కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో చిరంజీవి, నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. కోడిరామకృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూడచారి నెం1, సింహపురిసింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 1995 డిసెంబర్ 14న “రిక్షావోడు” చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచింది. ఈ రెండు చిత్రాలు రిక్షా అనే టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ బరిలో ఉండటం ప్రేక్షకులతో సహా సినీ పరిశ్రమ తీవ్ర ఉత్కంఠతో గమనించింది. బ్లాక్ బస్టర్ లాంటి చిత్రాలతో మోత మోగించిన మెగాస్టార్ ఈ సంవత్సరం ఊహించని విధంగా కొంత చతికిల పడ్డారు. ఆయన‌ నటించిన “రిక్షావోడు” చిత్రాన్ని వెనక్కు నెట్టి నారాయణమూర్తి తన రిక్షాను ముందుకు నడిపించి, బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించాడు.