Tag Archives: raj kumar death

పునీత్ చేసిన గొప్పపని తలచుకుంటూ అతనికి నివాళి అర్పించిన టిఎస్ ర్టీసి మేనేజింగ్ డైరెక్టర్.. సజ్జనార్!

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన మరణవార్త తెలియగానే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శిస్తూ ఎంతో భావోద్వేగంతో అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పునీత్ మరణంపై టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందిస్తూ ఆయన మృతికి నివాళులర్పించారు.

పునీత్ ఒక హీరోగా మాత్రమే కాకుండా సొంత ఖర్చులతో ఎన్నో అనాధాశ్రమాలు విద్యాలయాలను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గతంలో పునీత్ చేసిన ఒక గొప్ప పనిని తలచుకుంటూ సజ్జనార్ నివాళులర్పించారు. ఈయన గతంలో బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ ) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే ఆయన ప్రజలందరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించి ఎంతో సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని పొందాలని మాట్లాడుతూ బస్ లేన్ ప్రియారిటి గురించి ప్రజలలో అవగాహన కల్పించారు.బస్ ప్రయారిటీ లేన్ లో బీఎంటీసీ బస్సులు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్లు లాంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ చేసిన ఒక మంచి పనిని సజ్జనార్ గుర్తుచేసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ తరఫున ఆయన ప్రెస్ నోట్ విడుదల చేస్తూ అతని మృతికి సంతాపం తెలియజేశారు.

ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని చూడటం కోసం ఎంతో మంది అభిమానులు ప్రముఖ సినీ సెలబ్రిటీలు తరలివస్తు ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమార్తె జర్మనీలో ఉండటంవల్ల ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

పునీత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ.. చనిపోవలసిన వయసుకాదంటూ..ట్వీట్!

పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచేసింది. కన్నడ ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తమ హీరో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని అటు అతని కుటుంబంలో, ఇటు కన్నడ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇతని మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మృతికి సంతాపం తెలుపుతున్నారు.

పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని అంటూ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పునీత్ మరణం పై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు.పునీత్ ని అతడి అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు.పునీత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు తన అన్న శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు.

ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో యష్ తో కలసి స్టేజిపై స్టెప్పులు కూడా వేశారు. ఇక పునీత్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. విధి చాలా క్రూరమైనది. మంచి వ్యక్తి ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్ కుమార్ ను మనకు దూరం చేసింది. పునీత్ ది చనిపోవలసింది వయసు కాదు. అతడు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటారని,అతని అద్భుతమైన వ్యక్తిత్వం ను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని అన్నారు మోడీ.

ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి అంటూ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.పునీత్ చనిపోయినప్పటికీ ఆయన కళ్లు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ అతని కళ్ళను దానం చేయనున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో అతడి తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్ళను ఒకరికి దానం చేశారు.