Tag Archives: Rajyalakshmi

శంకరాభరణం రాజ్యలక్ష్మికి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా..?

నటి రాజ్యలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది రాజ్యలక్ష్మి. 1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్న సమయంలో ఆమె తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రంలోని శారద పాత్రకోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది.

నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. మొదటి సనిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె ‘శంక‌రాభ‌ర‌ణం’ను ఇంటిపేరుగా మార్చుకొని ‘శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి’గా పాపుల‌ర్ అయ్యారు.

ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్ తో నిప్పులాంటి నిజం సినిమాలో నటించారు. తర్వాత ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ అనే సినిమాలో బాలయ్యతో నటించారు. 1990 లో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అయితే అక్కడ సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది.. కానీ నటనను మాత్రం వదల్లేదు. 1999లో ఆమె తమిళంలోనో ఓ సీరియల్ లో నటనకు ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ల‌భించింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు(రోహిత్, రాహుల్) జన్మించారు. చిన్నతనం కాబట్టి వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడానికి సమయం ఎక్కువగా కేటాయించేవారు.

వాళ్లు పెరిగి పెద్ద అయిన తర్వాత తిరిగి 2004 లో వీరు చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు, సీరియల్స్ లల్లో నటిగా కొనసాగించింది. అయితే ఆమె పెళ్లి అంత సింపుల్ గా జరగలేదు. ఓ రోజు తన కుటుంబంతో డిన్నర్ కు వెళ్లినప్పడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడు సింగపూర్ లో ఉంటాడని ఆమె తెలుసుకున్నారు. తనకు సింగపూర్ లో షూటింగ్ ఉంటుందని అతడికి చెప్పగా.. మీరు వస్తే.. మమ్మల్ని మీట్ అవ్వండి అంటూ విసిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇలా ఆమె సింగపూర్ వెళ్లినప్పడు అతడిని కలవడం.. రాజ్యలక్ష్మి వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చడం జరిగిపోయాయి. ఇలా ఓ డిన్నర్ వద్ద పరిచయమైన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

పాట‌లో రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోడానికి సురేష్ ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలుసా..!

శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ‘జ‌గ‌మొండి’ సినిమాలో సురేష్ మొదటి సారిగా నటించారు. ఇందులో అతడు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం స‌మ‌తా ఆర్ట్స్ రూపొందించారు. ఇక్కడ సురేష్ కు జోడీగా ‘శంక‌రాభ‌ర‌ణం’ రాజ్య‌ల‌క్ష్మి నటించారు. ఓ పాటను వీళ్లద్దరి మద్య ఊటీలో చిత్రీకరించారు. ఆ పాటలోనే సురేష్ మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నారు. అంతకముందు అతడికి నటనలో గానీ, నాట్యంలో గానీ ఎలాంటి అనుభవం కూడా లేదు.

అప్పటికే రాజ్యలక్ష్మి శంకరాభరణం చిత్రం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. త‌న‌కంటే సీనియ‌ర్ న‌టితో క‌లిసి పాట‌పాడుతూ, డాన్స్ చెయ్య‌డం అన‌గానే మొద‌ట్లో సురేష్ కు కొంచెం జంకు క‌లిగింది. వీరిద్దరి మధ్య జరిగే మొదటి దృశ్యంలో సురేష్ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోవాలి. అయితే దర్శకుడు మధుసూదనరావు చిత్రీకరణ కంటే ముందే రిహాసల్స్ చేయించారు.

రాజ్యలక్ష్మిని అతడు రిహాసల్స్ సమయంలో కూడా కౌగిలించుకోకుండానే మూవ్‌మెంట్స్ చూసుకొని మ‌ధుసూద‌న‌రావు ‘టేక్’ అన్నారు. తర్వాత సౌండ్ స్టార్ట్ అయింది. పాట మొదలైంది.. పురుగెత్తుకుంటూ వెళ్లి అతడు రాజ్యలక్ష్మిని కౌగిలించుకోవాలి. పెదాలు కదుపుతూ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి రాజ్య‌ల‌క్ష్మిని కౌగిలించుకోబోయే ముందు ఆగిపోయాడు సురేష్.

ఏమైంది.. కౌగిలించుకోకుండా ఆగిపోయావు ఏంటి.. అంటూ డైరెక్టర్ ప్రశ్నించారు. కెమెరామేన్‌, డైరెక్ట‌ర్‌, ఇత‌ర యూనిట్ మెంబ‌ర్స్ ముందు ఒక అమ్మాయిని కౌగిలించుకోవ‌డం అనేస‌రికి సురేష్ కు ఏదోలా అనిపించింది. సరే మళ్లీ మరో టేక్ అన్నట్లు చెప్పాడు.. ఇబ్బంది పడుకుంటూనే.. ఇలా ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. అయిదు.. ఆరు.. ఏడు.. ఇలా టేకులు తీశారు. డైరెక్టర్ అతడిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఎనిమిదో టేక్ లో ఓకె చేశారని ఓ సందర్భంలో సురేష్ తెలియజేశారు.

వయసు పెరిగినా తీరు మారలేదంటూ.. సుమ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి !

బుల్లితెరపై అన్ని చానల్లో తనదైన రీతిలో వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అందరు టక్కున సుమ పేరు చెబుతారు.గత రెండు దశాబ్దాల కాలం నుంచి టెలివిజన్ రంగంలో దూసుకుపోతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సుమ వ్యవహరించే అన్ని కార్యక్రమాలలో కెల్లా అత్యధిక రేటింగ్స్ లో దూసుకుపోతున్న కార్యక్రమం క్యాష్ ఒకటి అని చెప్పవచ్చు.

తాజాగా ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వారం ఈ కార్యక్రమానికి సీనియర్ సెలబ్రిటీలు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతిలతో కలిసి సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఏ కార్యక్రమంలోనైనా సుమ వచ్చే గెస్ట్ ల పై పంచులు వేయడం సాధారణమే. కానీ ఈ మధ్యకాలంలో కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు సైతం సుమ పై పంచులు వేయడంతో కార్యక్రమం ఎంతో సరదాగా సాగిపోతోంది.

ఇక ఈ వారం ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన గెస్ట్ లు యాంకరమ్మకు సరైన రీతిలో పంచులు వేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి రాజ్యలక్ష్మి సుమ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మి షోకి అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు.

సుమ ఈరోజు నాకు కాంపిటీషన్ గా మీరు తయారయ్యి వచ్చారు అంది. దీంతో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది… మేము మా చిన్నప్పుడు ఇలా లంగావోణీలు వేసాము.. కానీ నువ్వు ఇంకా అవే వేస్తున్నావు అంటూ ఆమె గురించి కామెంట్ చేశారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ ఈ మాటకు అర్థం ఏంటి? నాకు వయసు పెరిగినా ఇంకా ఇలాగే లంగా వోణీలు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా.. అని ప్రశ్నించడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.