Tag Archives: ramesh

Indira Devi: మహేష్ బాబు తల్లి మృతి.. విషాదంలో ఘట్టమనేని ఫ్యామిలీ..!

Indira Devi: ఒకప్పటి అగ్ర హీరో అయినా కృష్ణ సతీమణి ఇందిరా దేవి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మహేష్ బాబు తల్లి అన్న విషయం కూడా తెలిసిందే. మహేష్ బాబుకి ఇందిరాదేవి అంతే ప్రాణం అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే పలుసార్లు స్టేజ్ పై తన తల్లి గురించి మాట్లాడినప్పుడు మహేష్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వినిపించాయి.

గత కొద్ది రోజులుగా అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి తాజాగా ఆ పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ఎమర్జెన్సీ వార్డ్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటోంది. అయితే తాజాగా అందులో సమాచారం ప్రకారం ఆమె కొద్దిసేపటి క్రితం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

ఈ వార్త తెలిసిన పలువురు ఘట్టమనేని అభిమానులు ఇందిరా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. దంపతులకు మహేష్ బాబు, రమేష్,మంజుల జన్మించారు. కాగా కృష్ణ రెండవ భార్య అయిన విజయనిర్మల 2019లో మరణించిన సంగతి తెలిసిందే.

Indira Devi: కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవీ మృతి..

ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవిని 1961 లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కృష్ణ విజయనిర్మలను 1969 లో రెండవ పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా అతను అన్న ను కడసారి కూడా చూడలేకపోయారు మహేష్ బాబు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ కోరుకుంటుండగా ఇంతలోనే ఇందిరా దేవి ఆరోగ్యం సీరియస్ కావడం ఆమె మరణించడంతో ఒకసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Thagubothu Ramesh: మరోసారి తాను తండ్రి అయిన తాగుబోతు రమేష్..!


ఈటీవీలో ప్రసారం అవుతున్న బబర్దస్త్ షో తెలియని వారంటూ ఉండరు. ఎవరైనా అలసిపోయినప్పుడు గానీ.. డల్ గా ఉన్న సందర్భంలో చాలామంది జబర్దస్త్ షో చూస్తూ.. కాస్త రిలాక్స్ పొందుతారు. అయితే ఈ షోకి వచ్చే టీఆర్పీ రేటింగ్ మరేషోకి కూడా రాదు. అంతలా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ షో. ఇలా ఈ వేదికపై ఎంతో మంది ఎదిగా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

బుల్లితెరపై స్టార్ స్టేటస్ పొంది.. వెండితెరపైనా మెరిసిన వారున్నారు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాల్లో నటించేవారు చాలామంది ఉన్నారు. ధన్ రాజ్, వేణు, రోలర్ రఘు, అభి వంటి వారు వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చిన వారే. ఇక హైపర్ ఆది, సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, మహేష్ వంటి వారు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిరూపించేందుకు పాట్లు పడుతున్నారు.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

అయితే కొన్ని నెలల క్రితం తాగుబోతు రమేష్ కూడా దీనిలో చేరాడు. అతడు ఒక టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇటు వైపు వచ్చాడా.. లేదా మరేదైనా కారణం ఉందా తెలియదు కానీ.. ప్రస్తుతం అతడు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. మళ్లీ సినిమాలో తన ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో పాటు ఎన్నో యేళ్ల నుంచి ఉంటోన్న జీవన్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ప్రతీ స్కిట్‌లో జీవన్‌ను ఎరుపు అంటూ ఆట పట్టించడం.. పిచ్చోడిని చేయడం జరుగుతూనే ఉంది.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

ఇక టీం లీడర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇద్దరి పరిస్థతి కూడా అంతే ఉంది. ఈ సందర్భంలో తాగబోతు రమేష్ తన అభిమానులకు.. ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. తాను మరో బిడ్డకు తండ్రిని అయ్యానని చెప్పాడు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్‌ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకుకోగా.. 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అతడికి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు.. అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేశారు. తోటి కమెడియన్లు కూడా అతడికి ఫోన్ చేసి అభినందించారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పాడు రమేష్.

పవన్ కళ్యాణ్ పాటపై పోలీసుల అభ్యంతరం.. కారణం ఎంటంటే..?

పవన్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాలోంచి ఓ పాటను విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. దీనిని తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పాడారు.

పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా.. 10 గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయి. బీమ్లా నాయక్ లోని ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాట లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి పోలీసుల‌ని కించ ప‌రిచే విధంగా ప‌దాలు రాసార‌ని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం.. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.. అంటూ డీసీపీ రమేష్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారింది. మ‌రి దీనిపై ర‌చ‌యిత‌, చిత్ర నిర్మాత నుండి ఏదైన స్పంద‌న వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. దీనిపై పవన్ సినీ బృందం ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.