Indira Devi: ఒకప్పటి అగ్ర హీరో అయినా కృష్ణ సతీమణి ఇందిరా దేవి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మహేష్ బాబు తల్లి అన్న విషయం కూడా తెలిసిందే. మహేష్ బాబుకి ఇందిరాదేవి అంతే ప్రాణం అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే పలుసార్లు స్టేజ్ పై తన తల్లి గురించి మాట్లాడినప్పుడు మహేష్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వినిపించాయి.
గత కొద్ది రోజులుగా అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి తాజాగా ఆ పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ఎమర్జెన్సీ వార్డ్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటోంది. అయితే తాజాగా అందులో సమాచారం ప్రకారం ఆమె కొద్దిసేపటి క్రితం ఇంట్లోనే తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా మహేష్ బాబు ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
ఈ వార్త తెలిసిన పలువురు ఘట్టమనేని అభిమానులు ఇందిరా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య అన్న విషయం తెలిసిందే. దంపతులకు మహేష్ బాబు, రమేష్,మంజుల జన్మించారు. కాగా కృష్ణ రెండవ భార్య అయిన విజయనిర్మల 2019లో మరణించిన సంగతి తెలిసిందే.
ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఇందిరా దేవిని 1961 లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కృష్ణ విజయనిర్మలను 1969 లో రెండవ పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా అతను అన్న ను కడసారి కూడా చూడలేకపోయారు మహేష్ బాబు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ కోరుకుంటుండగా ఇంతలోనే ఇందిరా దేవి ఆరోగ్యం సీరియస్ కావడం ఆమె మరణించడంతో ఒకసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…