Tag Archives: Ramoji Film City

Balakrishna: బాలకృష్ణ పాన్ ఇండియా స్థాయిలో నటించిన విక్రమ సింహభూపతి మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Balakrishna: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇలా భారీ బడ్జెట్ చిత్రాలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పాలి.ఈ క్రమంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ విక్రమ సింహభూపతి అనే భారీ బడ్జెట్ స్థాయిని తెరకెక్కించాలని భావించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాహుబలి సినిమాను మించి ఉంటుందని. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తారు. ఇలా బాలకృష్ణ తన నాన్నమ్మతో కలిసి బాలకృష్ణ ప్రతాప్ వర్మ అనే పాత్రలో నటిస్తూ అడవిలో ఉంటారు. కొందరు బందిపోటులు అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చి బాలకృష్ణను చూసి అందరూ తనకు నమస్కారం పెడతారు.

అదే సమయంలో సినిమా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి ప్రతాప్ వర్మ ఎవరు తన తండ్రి ఎవరు తన తండ్రిని ఎవరు చంపారనే విషయం గురించి సినిమా కథ నడుస్తుంది. ఇలా ఎన్నో ట్విస్ట్ లతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక 2001వ సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద ఎత్తున సెట్ వేసి ఈ సినిమా రెండు పాటలను చిత్రీకరించడమే కాకుండా 50% షూటింగ్ కూడా పూర్తి చేశారు.

Balakrishna: సిద్ధాంతి జోస్యం చెప్పడమే కారణమా

ఒక సిద్ధాంతి నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డితో ఈ సినిమా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావని చెప్పారట. అనుకున్నట్టుగానే ఆయన చెప్పిన విధంగానే బాలకృష్ణ సీమ సింహం సినిమా కోసం కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవడం అలాగే బాలకృష్ణ నానమ్మ పాత్రలో నటించినటువంటి భానుమతి తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇక నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అయితే ఈ సినిమా కనుక ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే అప్పట్లోనే ఈ సినిమా బాహుబలి స్థాయిలో హిట్ అయి ఉండేదని భావిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమాని తిరిగి చేయాలన్న దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత బి గోపాల్ రెడ్డి కూడా లేరు కనుక ఈ సినిమా ఆసాధ్యం అనే చెప్పాలి.

మరోసారి ప్రియుడికి దూరమైన నయనతార.. కారణం అదే!

నయనతార అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నయనతార తన ప్రేమ విషయంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార ప్రస్తుతం తమిళ నటుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. తమిళనాడులో వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.అంతే కాకుండా వీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం నయనతార తమిళ, మలయాళ చిత్రాలలో భాగంగా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నారు. కొద్ది రోజుల పాటు షూటింగ్ ఇక్కడే ఉండటంతో నయనతార రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నారు. అయితే తన ప్రియుడు విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పటికీ తన ప్రియుడుకు నయనతార దూరంగా ఉంటున్నారు. ఇలా ఇద్దరూ ఒకే చోట ఉన్న దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతం నయనతార, రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న  ‘అన్నత్తే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

అలాగే విగ్నేష్ శివన్ రామోజీ ఫిలిం సిటీలో విజయ్ సేతుపతి, సమంత జంటగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ విధంగా రెండు చిత్రాల షూటింగ్ పనులు ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతుండడంతో ఒక సినిమాకు సంబంధించిన బృందం, మరొక సినిమా టీంతో మాట్లాడకూడదననే షరతు ఉండటం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఈ విధంగా తన ప్రియుడు విగ్నేష్ శివన్ పక్కనే ఉన్నా కూడా నయనతార డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితిలో లేదని చెప్పవచ్చు.