Tag Archives: ramulamma

Babu Mohan: రెండు రోజులు మా ఇంట్లో ఉండు.. యాంకర్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

Babu Mohan:తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాబు మోహన్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో ఈయన బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.

ఇక ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన విడిపోయి బిజెపి పార్టీలోకి చేరారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బాబు మోహన్ పలు విషయాల గురించి మాట్లాడుతూ సదరు యాంకర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ మొదట్లో యాంకర్ తో కలిసి సరదాగా మాట్లాడిన ఈయన యాంకర్ అడిగిన ప్రశ్నలకు తరువాత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు కెసిఆర్ ను బావ అంటూ పిలిచేవారు. ఇప్పుడు ఎందుకు తనని తిడుతున్నారంటూ ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మీకు ఎంతవరకు సమాధానం కావాలో ఏం చెప్పాలో నాకు తెలుసు అంటూ మండి పడ్డారు. ఇలా డిస్కషన్ చేస్తేనే జనాలకు అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Babu Mohan: మండిపడుతున్న నెటిజెన్స్…

ఇలా యాంకర్ అడగడంతో బాబు మోహన్ సమాధానం చెబుతూ ఇప్పుడు తాను ఫ్రీగా లేనని మరోసారి తన ఇంటికి వస్తే ఒక పూట కాదు రెండు రోజులు మా ఇంట్లోనే ఉండి తీరికగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అంటూ బాబు మోహన్ యాంకర్ పై మండిపడ్డారు.ఇలా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నైటిజన్స్ బాబు మోహన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sreemukhi: పబ్లిక్ గా పరువు పోగొట్టుకున్న రాములమ్మ… మొదటిసారి అడ్డంగా దొరికిపోయిన శ్రీముఖి!

Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం అన్ని చానల్లోని ఏదో ఒక కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది.

ఇక సెలబ్రిటీల అన్న తర్వాత ఎన్నో ఈవెంట్లకు హాజరవుతూ ఉంటారు. అయితే ఇలా వెళ్లిన ప్రతిసారి మోడ్రన్ దుస్తులను ధరించి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు వీరు ధరించిన దుస్తుల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీముఖి సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.ఎక్కడికి వెళ్ళినా ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా వెళ్లే శ్రీముఖి ఓ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ డ్రెస్ ధరించి మెరిసిపోయారు.

ఈ క్రమంలోనే శ్రీముఖి ఈ బ్లాక్ డ్రెస్ ధరించి ఏదో పని నిమిత్తం ఒక్కసారిగా కిందికి వంగారు. దీంతో అమ్మడి అందాలు మొత్తం కెమెరా కంటికి చిక్కడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే శ్రీముఖి ఇలాంటి దుస్తులు ధరించి కాస్త ఇబ్బంది పడటంతో మొదటిసారి ఇలా పబ్లిక్ గా తెలియకుండానే అందాల ప్రదర్శన చేసింది.

Sreemukhi:బుల్లితెరపై బిజీగా గడుపుతున్న రాములమ్మ..


ఇలా ఎద అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శ్రీముఖి ప్రస్తుతం ప్రతి ఒక్క బుల్లితెర చానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈమె మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.

భర్తను అతికిరాతంగా చంపి.. తన ఇంట్లోనే బాత్రూంలో పాతిపెట్టిన భార్య.. చివరకు..!

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో తన భార్య క్షణికావేశంలో భర్తను చంపి.. తన ఇంట్లోనే బాత్ రూంలో పాతిపెట్టింది. దీంతో తిన్నిగా వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ.. ఆమె చెప్పగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య రాములమ్మ దంపతులు. వారికి రెండు ఎకరాలు పొలం ఉంది. ఆ రెండు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.

అయితే.. తన సోదరుడు కనిపించడకుండా పోయాడంటూ.. అతడి అక్కలు.. ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మ గ్రామానికి చేరుకుని వదిన రాములమ్మను నిలదీశారు. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో చెన్నమ్మ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా.. భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది.

మిగిలిన ఎకరా పొలాన్ని కూడా అమ్ముతానని గొడవ చేస్తుండడంతో కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంట్లోని బాత్​రూంలో శవాన్ని పాతిపెట్టామని పేర్కొంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.