భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో తన భార్య క్షణికావేశంలో భర్తను చంపి.. తన ఇంట్లోనే బాత్ రూంలో పాతిపెట్టింది. దీంతో తిన్నిగా వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ.. ఆమె చెప్పగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన 45 ఏళ్ల చెన్నయ్య రాములమ్మ దంపతులు. వారికి రెండు ఎకరాలు పొలం ఉంది. ఆ రెండు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు.
అయితే.. తన సోదరుడు కనిపించడకుండా పోయాడంటూ.. అతడి అక్కలు.. ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మ గ్రామానికి చేరుకుని వదిన రాములమ్మను నిలదీశారు. ఆమె ప్రవర్తనలో అనుమానం రావడంతో చెన్నమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను విచారించగా.. భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది.
మిగిలిన ఎకరా పొలాన్ని కూడా అమ్ముతానని గొడవ చేస్తుండడంతో కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంట్లోని బాత్రూంలో శవాన్ని పాతిపెట్టామని పేర్కొంది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…