Tag Archives: rangamarthanda

Anchor Anasuya: మొదటిసారి మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ… జీవితానికి ఇది చాలంటూ ఎమోషనల్!

Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నేను ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు రంగ మార్తాండ సినిమాలో నేను నటించాను. నా జీవితానికి ఇది చాలు నేను నిన్నే సినిమా చూశాను.ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను. 


Anchor Anasuya:ఎంతో పుణ్యం చేసుకున్నా…


ఇలా ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాగా గుర్తుండిపోతుంది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చిందిఅంటూ ఈమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ramyakrishna: కళ్ళతోనే నటించమన్నాడు… నేను అలాగే చేశా.. రంగమార్తాండ సినిమా పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Ramyakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో అలనాటి స్టార్ హీరోలు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రంగమార్తండా సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది.

ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉగాది సందర్భంగా మార్చి 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రమ్యకృష్ణ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ…” ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు ఈ కాలంలో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన నా మాట వినకుండా చాలా మొండిగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరు సెలెక్ట్ కాకపోవటంతో ఈ పాత్రలో నేను నటిస్తానని చెప్పి ముందుకు వచ్చాను.

Ramyakrishna:కృష్ణవంశీ కెరియర్ లోనే బెస్ట్ సినిమా…

ఈ సినిమాలో నా పాత్రలో నటించాలి అంటే కళ్ళతోనే నటించాలని ఆయన చెప్పారు నేను కూడా అలాగే నటించా. అసలు ఈ సినిమాలో నా పాత్ర నివిడి ఇంత ఉంటుందని ఊహించలేదు అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది..ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా నాకు ఎమోషనల్ సినిమాలు నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమా కృష్ణ వంశీ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది” అంటూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Krishna Vamsi: ఎట్టకేలకు రమ్యకృష్ణతో విభేదాల పై నోరు విప్పిన కృష్ణవంశీ.. ఏమన్నారంటే?

Krishna Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన ఒకప్పుడు ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన 2017 వ సంవత్సరంలో నక్షత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే ఈయన తాజాగా రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు బాధ్యతలు అంటే చాలా భయమని అందుకే తాను పెళ్లి చేసుకోవాలి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలు ఉండేవి కాదని తెలిపారు. అనుకోకుండా తన జీవితంలోకి రమ్యకృష్ణ వచ్చిందని కృష్ణ వంశీ తెలిపారు. అయితే తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా ఇద్దరికీ ఓ కుమారుడు ఉన్నాడు. ఈ మార్పు తప్ప మా జీవితంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.

సెలబ్రిటీలన్న తర్వాత ఈ వార్తలు సర్వసాధారణం…

నేను పెళ్లయిన నా జీవితాన్ని నా ఇష్టపూర్వకంగానే బ్రతికాను తన జీవితం తాను అలాగే బ్రతుకుతుంది. ఇకపోతే రమ్యకృష్ణతో డబ్బు విషయంపై విభేదాలు వచ్చాయని వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై కృష్ణవంశీ స్పందిస్తూ సెలబ్రిటీలు అన్న తర్వాత ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం ఇలాంటి వార్తలు విన్నప్పుడు మేము కూడా నవ్వుకుంటాము కానీ ఇలా అందరూ తప్పుగా ఆలోచిస్తారని నేను భావించలేదు ఏ కొందరో ఇలాంటి వార్తలను సృష్టిస్తుంటారు అందుకే తాను కూడా ఎప్పుడు ఈ విషయాలను ఖండించలేదని మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishna Vamsi: నేను ప్రాణాలతో ఉన్నానంటే చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏ కారణం… కృష్ణవంశీ కామెంట్స్ వైరల్?

Krishna Vamsi: కృష్ణవంశీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.

ఇకపోతే తాజాగా ఈయన రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రకాష్ రాజ్ కీలకంగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృష్ణ వంశీ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన చిరంజీవి గారితో తనకున్న అనుబంధం గురించి కూడా బయటపెట్టారు.

మెగాస్టార్ చిరంజీవిని తాను అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటానని ఆయన కూడా తనని ఒక తమ్ముడుగా భావిస్తారని కృష్ణవంశీ వెల్లడించారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో ఒక యాడ్ షూటింగ్ సమయంలో మాట్లాడుతూ అన్నయ్య తనకి ఇష్టమైన వారికి కారును బహుమానంగా ఇస్తారని తమాషాగా చెప్పాను. నేను ఈ మాటలు అన్న కొద్ది రోజులకు తనని ఇంటికి రమ్మని ఫోన్ చేశారు.

కారును బహుమానంగా ఇచ్చిన మెగాస్టార్…

ఇంటికి వెళ్ళగానే తనకు కారు గిఫ్ట్ గా ఇస్తున్న విషయాన్ని తెలిపారు. ఇలా అన్నయ్య చెప్పేసరికి తాను ఒకసారిగా ఆశ్చర్యపోయానని అయితే తాను ఇచ్చే బహుమతి వద్దని చెబుతున్నప్పటికీ మెగాస్టార్ మాత్రం అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నావు మరి ఈ అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ తీసుకోవా అని చెప్పడంతో చాలా మొహమాటంగా ఆ కారును బహుమానంగా తీసుకున్నానని తెలిపారు. అయితే ఆ బహుమానమే తన ప్రాణాలను కాపాడిందని ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే ఆ కారే కారణమని తెలిపారు. ఆ కారులో ఒకరోజు నందిగామ వెళ్లి వస్తుండగా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం డామేజ్ అయినప్పటికీ తను మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డానని ఈ సందర్భంగా ఆ కారు గురించి కృష్ణవంశీ తెలిపారు.