Krishna Vamsi: కృష్ణవంశీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.
ఇకపోతే తాజాగా ఈయన రంగమార్తాండ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రకాష్ రాజ్ కీలకంగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృష్ణ వంశీ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన చిరంజీవి గారితో తనకున్న అనుబంధం గురించి కూడా బయటపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవిని తాను అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటానని ఆయన కూడా తనని ఒక తమ్ముడుగా భావిస్తారని కృష్ణవంశీ వెల్లడించారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో ఒక యాడ్ షూటింగ్ సమయంలో మాట్లాడుతూ అన్నయ్య తనకి ఇష్టమైన వారికి కారును బహుమానంగా ఇస్తారని తమాషాగా చెప్పాను. నేను ఈ మాటలు అన్న కొద్ది రోజులకు తనని ఇంటికి రమ్మని ఫోన్ చేశారు.
ఇంటికి వెళ్ళగానే తనకు కారు గిఫ్ట్ గా ఇస్తున్న విషయాన్ని తెలిపారు. ఇలా అన్నయ్య చెప్పేసరికి తాను ఒకసారిగా ఆశ్చర్యపోయానని అయితే తాను ఇచ్చే బహుమతి వద్దని చెబుతున్నప్పటికీ మెగాస్టార్ మాత్రం అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నావు మరి ఈ అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ తీసుకోవా అని చెప్పడంతో చాలా మొహమాటంగా ఆ కారును బహుమానంగా తీసుకున్నానని తెలిపారు. అయితే ఆ బహుమానమే తన ప్రాణాలను కాపాడిందని ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే ఆ కారే కారణమని తెలిపారు. ఆ కారులో ఒకరోజు నందిగామ వెళ్లి వస్తుండగా పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం డామేజ్ అయినప్పటికీ తను మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డానని ఈ సందర్భంగా ఆ కారు గురించి కృష్ణవంశీ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…