Srinu Vaitla:. శ్రీను వైట్ల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు.గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సీను వైట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుని దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి దూకుడు ప్రదర్శించాయి.
ఇలా సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈయనకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా నుంచి వరుస అపజయాలు వెల్లువెత్తాయి. ఈ విధంగా వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో ఈయనకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే గత కొంతకాలం నుంచి ఈయన విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమా సీక్వెల్ ద్వారా రాబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా శీను వైట్లను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేక సమస్యలు నడుమ చిక్కుకున్న శ్రీను వైట్ల తాజాగా మరొక సమస్య ద్వారా వార్తల్లో నిలిచారు. శీను వైట్ల భార్య రూపా గురించి మనకు తెలిసిందే. ఈమె శ్రీను వైట్ల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించేది.
ఈ విధంగా వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీను వైట్ల రూపా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని అయితే తాజాగా ఈమె విడాకుల కోసం నాంపల్లి కోర్టుకు అప్లై చేశారని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఒకవైపు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న శీను వైట్లకు ఇలా విడాకుల సమస్య రావడం ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…