Anchor Anasuya:బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా అనసూయ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నేను ఎమోషనల్ అవుతున్నాను. మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు రంగ మార్తాండ సినిమాలో నేను నటించాను. నా జీవితానికి ఇది చాలు నేను నిన్నే సినిమా చూశాను.ఆల్రెడీ నటసామ్రాట్ చూసి ఏడ్చారు కదా.. మళ్లీ దీనికి ఏం ఏడుస్తాంలే అనుకున్నాను. కానీ.. థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక ఒక ఆడియెన్ గా చూశాను.
ఇలా ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సినిమాగా గుర్తుండిపోతుంది. ఇందులో నటించిన వారితో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చిందిఅంటూ ఈమె కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…