Tag Archives: remdesivir

ఆ మందు కరోనా చికిత్సకు వాడొద్దు.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా చికిత్సకు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు కొరత అధికంగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పై అనుమానాలు ఉన్నాయని, ఇంజెక్షన్లను ఉపయోగించటం వల్ల కరోనా బాధితులు కరోనా నుంచి కోరుకున్నట్లు తమకు ఎటువంటి ఆధారాలు లేవని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి సందేహాలు తలెత్తడం వల్లే ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ కరోనా చికిత్స నుంచి తొలగించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

ఈ క్రమంలోనే భారత్ లో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంజక్షన్ పై అనుమానాలు తలెత్తడంతో ఇంజెక్షన్లను కరోనా బాధితులకు ఉపయోగించకూడదని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్ని రోజులు కరోనా చికిత్సలో భాగంగా ఎంతో డిమాండ్ ఏర్పడిన రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లను కొందరు ప్రభుత్వ సిబ్బంది చేతివాటం చూపిస్తూ బయట బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ వేలల్లో అమ్ముతూ డబ్బును పోగు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటువంటి సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంజెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

భయంకరమైన నిజాలు.. కరోనా రోగులకు నీళ్లతో ఇంజెక్షన్లు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు. రోగులకు అందాల్సిన మందులను పక్కదారి పట్టిస్తూ డబ్బు పోగు చేసుకుంటున్నారు. రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకుంటూ, రోగులకు నీళ్లతో ఇంజెక్షన్ లు వేస్తున్న ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది.

నగరంలోని సుబర్తి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులకు చేరాల్సిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇద్దరు వార్డ్ బాయ్ లు కలసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బయట మార్కెట్లో దాదాపు రూ.25 వేలకు అమ్మకుంటున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆ వార్డ్ బాయ్ ల పై పోలీసులు మఫ్టీలో వచ్చి నిఘా వేశారు.

మఫ్టీలో వచ్చిన పోలీసులు వార్డు బాయిలను గమనించగా కరోనా రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను మార్కెట్ లో అమ్ముకుంటూ వారికి డిస్టిలరీ వాటర్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆస్పత్రి బౌన్సర్లు పోలీసులపై దాడి చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 81 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్ లను బయట మార్కెట్లో 25 నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారని డీసీసీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు.