ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు. రోగులకు అందాల్సిన మందులను పక్కదారి పట్టిస్తూ డబ్బు పోగు చేసుకుంటున్నారు. రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకుంటూ, రోగులకు నీళ్లతో ఇంజెక్షన్ లు వేస్తున్న ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది.
నగరంలోని సుబర్తి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులకు చేరాల్సిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇద్దరు వార్డ్ బాయ్ లు కలసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బయట మార్కెట్లో దాదాపు రూ.25 వేలకు అమ్మకుంటున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆ వార్డ్ బాయ్ ల పై పోలీసులు మఫ్టీలో వచ్చి నిఘా వేశారు.
మఫ్టీలో వచ్చిన పోలీసులు వార్డు బాయిలను గమనించగా కరోనా రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను మార్కెట్ లో అమ్ముకుంటూ వారికి డిస్టిలరీ వాటర్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆస్పత్రి బౌన్సర్లు పోలీసులపై దాడి చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 81 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్ లను బయట మార్కెట్లో 25 నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారని డీసీసీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…