ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు. రోగులకు అందాల్సిన మందులను పక్కదారి పట్టిస్తూ డబ్బు పోగు చేసుకుంటున్నారు. రోగులకు అందించాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముకుంటూ, రోగులకు నీళ్లతో ఇంజెక్షన్ లు వేస్తున్న ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది.
నగరంలోని సుబర్తి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కరోనా రోగులకు చేరాల్సిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఇద్దరు వార్డ్ బాయ్ లు కలసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ బయట మార్కెట్లో దాదాపు రూ.25 వేలకు అమ్మకుంటున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆ వార్డ్ బాయ్ ల పై పోలీసులు మఫ్టీలో వచ్చి నిఘా వేశారు.
మఫ్టీలో వచ్చిన పోలీసులు వార్డు బాయిలను గమనించగా కరోనా రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను మార్కెట్ లో అమ్ముకుంటూ వారికి డిస్టిలరీ వాటర్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.ఇది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో ఆస్పత్రి బౌన్సర్లు పోలీసులపై దాడి చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు 81 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్ లను బయట మార్కెట్లో 25 నుంచి 40 వేల వరకు అమ్ముతున్నారని డీసీసీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…