Tag Archives: road side

Jhansi: రోడ్డు పక్కన చెత్తను ఏరుకుంటున్న స్టార్ యాంకర్.. ఇదేం పని అంటున్న నేటిజన్స్?

Jhansi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకానొక సమయంలో వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఝాన్సీ ప్రస్తుతం యాంకరింగ్ కు దూరం అయ్యారు.

ఇలా యాంకర్ గా బుల్లితెరకు వస్తే చెప్పినటువంటి ఈమె వెండితెరపై మాత్రం వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఝాన్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె రోడ్డుపై ఉన్నటువంటి చెత్తను మొత్తం ఏరుకొని తన కారులో వేసుకుంటూ కనిపించారు.

ఈ సందర్భంగా ఝాన్సీ ఈ చెత్తను ఏరుకోవడం గురించి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే చెత్త ఏరుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సాధారణంగా ప్రకృతి నుంచి లభించిన ఏ వస్తువు పాడైన తిరిగి అది ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది అనే సంగతి మనకు తెలిసిందే.

బూడిద చేయకండి…

ఈ క్రమంలోనే ఈమె రోడ్డు పక్కన ఎండిపోయిన గడ్డి ఆకులను ఏరుకుంటున్నారు.ఇక ఈ విషయం గురించి ఈమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎండిపోయిన ఆకులు గడ్డిని కాల్చి బూడిద చేయకండి.అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈమెపై నేటిజన్స్ ప్రశంసల కురిపిస్తున్నారు.

రోడ్డుపైన పదో తరగతి విద్యార్థి శవం.. సగం కాలిన స్థితిలో?

ప్రస్తుతం కరోనా ఉధృతి అధికంగా ఉన్న కారణంతో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా వారిని ఉత్తీర్ణత చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యార్థులందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ విధంగా పదో తరగతి చదివిన విద్యార్థి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. కానీ ఉదయానికి ఆమె శవమై స్థానికులకు కనిపించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాలకు చెందిన విష్ణు, పద్మలు దంపతులు. వారికి ఒక కూతురు స్రవంతి ఉంది. స్రవంతి పదవ తరగతి పూర్తి చేసుకుంది.తన తండ్రి విష్ణు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలోనే స్రవంతి ఇంట్లో తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది.బయటకు వెళ్ళిన కూతురు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులకు స్నేహితులకు ఫోన్ల ద్వారా తమ కూతురు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ విధంగా ఎంతోమందిని అడిగినప్పటికీ స్రవంతి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఘట్‌కేసర్‌లో దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు.

తన కూతురు తమతో గొడవ పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి పోయిందని విష్ణు, పద్మలు పోలీసులకు తెలిపారు.అయితే స్రవంతి తల్లిదండ్రులతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందా లేక ఆమె ఎవరైనా హత్యాచారం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.