Tag Archives: rumors

Nagashaurya: అనుష్క గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నాగశౌర్య… అలా చేయండి ప్లీజ్ అంటూ?

Nagashaurya: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది లేదన్న విషయం మాత్రం అందరికీ సందేహంగానే ఉంటుంది. అయితే ఈ వార్తలపై సదరు సెలెబ్రెటీలు స్పందిస్తే తప్ప అవి నిజం అని మాత్రం తెలియదు. ఇలాంటి రూమర్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్యకు సంబంధించినటువంటి ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలు నాగశౌర్య నిజంగానే అన్నారా లేక ఇవి కూడా కల్పితాలేనా అన్న విషయం తెలియదు కానీ అనుష్క గురించి నాగశౌర్య చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్య తనకు నటి అనుష్క శెట్టితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాయమని వేడుకున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అసలు నాగశౌర్య ఇలా ఎందుకు వేడుకున్నారనే విషయానికి వస్తే తనకు పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అందుకే ఈ వార్తలను ఖండిస్తూ ఆయన నేనే చెబుతున్నాను నాకు అనుష్క శెట్టి ఎఫైర్ ఉందని వార్తలు రాయండి అంటూ వేడుకున్నారని తెలుస్తోంది.

Nagashaurya: అనూష సెట్టింగ్ పెళ్లి చేసుకున్న నాగశౌర్య…

ఈ విధంగా నాగ శౌర్య అనుష్క శెట్టి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితేతన గురించి వచ్చిన ఆ వార్తలన్నీ కూడా ఆవాస్తవమేనని ఈయన చెప్పకనే చెప్పేశారు. ఇక ఈయన అనుష్క శెట్టి నీ పెళ్లి చేసుకోలేకపోయినా అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక వీరి వివాహం ఏడాది మొదట్లో ఎంతో ఘనంగా జరిగింది.

విడాకులపై ప్రశ్నించిన రిపోర్టర్.. ‘నీకు బుద్ధి ఉందా’ అంటూ.. ఫైర్ అయిన సమంత..

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ చైతూ, సమంత విడాకుల విషయం. వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవలు, మనస్పర్థలు జరిగాయని.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా అందుకే స్పందించడం లేదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా నాగచైతన్య లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దానికి సమంత రీ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో హీరోయిన్ సాయి పల్లవిని, సినిమా టీమ్ సభ్యులను మాత్రమే యాష్ ట్యాగ్ ఇచ్చారు.

అందులో నాగచైతన్యకు యాష్ ట్యాగ్ ఇవ్వకపోవడంతో ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆ మానసిక వేదన నుంచి బయటపడేందుకే సమంత అనేక మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.

అంతేకాకుండా ఆమె శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరున్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ దర్శనానికి సమంత ఒక్కరే వచ్చారు.. అక్కినేని కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఇదిలా ఉండగా.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మీపై వస్తున్న రూమర్స్ గురించి మీ సమాధానం ఏంటని అడగ్గా.. బుద్ది ఉందా నీకు.. పవిత్ర గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారిద్దరి మధ్య గొడవలు కారణంగానే ఎన్ని వార్తలు వచ్చినా స్పందించట్లేదని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’, తమిళంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తోంది సమంత.

సింగర్ చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్… సింగర్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్మయి తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసిస్తూ మహిళలకు అండగా నిలిచారు. ఈ మీటూ ఉద్యమం ద్వారా చిన్మయి నిత్యం వార్తల్లో నిలిచారు.

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటూ మహిళల పట్ల జరిగే దాడులకు వ్యతిరేకిస్తూ ఉంటారు. తాజాగా ఈ సింగర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న చిన్మయి గర్భవతి అని… త్వరలోనే వారు ఓ బిడ్డకు జన్మనివ్వడబోపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిన్మయి ఈ విషయంపై స్పందించారు.

నటుడు రాహుల్ సోదరుడు రవిచంద్రన్ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన రాహుల్ ఈ ఫోటోలో చిన్మయి చీరకట్టులో ఉంది.అయితే చిన్మయి చీర కట్టిన విధానం వల్ల ఆమె కడుపు పెద్దగా అనిపించడంతో అందరూ ప్రెగ్నెంట్ అని ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ తనపై వచ్చే ఈ వార్తలను ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అసలు విషయాన్ని తెలిపారు.

ఇది మా పెళ్లి ఫోటో.. ఇందులో నేను మడి సార్ ధరించాను. ఈ విధంగా చీర కట్టడం వల్ల నా ఉదరం పెద్దగా ఉంది. ఇలాంటి చీర కట్టును క్యారీ చేయడం తనకు చేత కాలేదని అందువల్లే ఈ విధంగా కనిపిస్తుంది.నేను గర్భవతిని కాదు అని చిన్మయి బేబీ బంప్‌ అంటూ యూట్యూబ్‌ ఛానల్స్‌ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్‌తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయినా నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని,ఒకవేళ నాకు పిల్లలు ఉన్న వారిని సోషల్ మీడియా వేదిక పరిచయం చేయనని ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి చిన్మయి గట్టిగా చురకలంటించారు .

రూమర్లపై బండ్ల గణేష్ భారీ కౌంటర్.. ఎందుకంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బండ్లన్న తన పై వచ్చే రూమర్స్ కు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటికి సరైన రీతిలో సమాధానం చెబుతున్నారు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి బండ్ల గణేష్ సినిమా ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన “మండేలా” చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఓటీటీలో విడుదలైన ఈ సినిమాపై తెలుగు నిర్మాతల కన్ను పడింది. ఎంతో మంచి విజయాన్ని అందుకున్న మండేలా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మన తెలుగు నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది.అయితే తమిళంలో యోగి బాబు నటించిన ఈ పాత్రలో తెలుగులో హీరోగా బండ్ల గణేష్ సరిగ్గా సరిపోతారని, ఈ సినిమా ద్వారా బండ్ల గణేష్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపించాయి.

ఈ సినిమాలో బండ్ల గణేష్ నటించడం కోసం రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మండేలా చిత్రంలో బండ్ల గణేష్ తప్పుకొని సునీల్ ఎంట్రీ ఇచ్చారనే వార్తలు రావడంతో ఈ విషయంపై బండ్లగణేష్ స్పందించారు. మండేలా చిత్రంలో నటించడం కోసం “ఒప్పుకుంటే కదా… తప్పు కునేది”అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది. బండ్ల గణేష్ ఈ విధంగా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయింది