Tag Archives: sai kumar

Hyper Aadi: పాయల్ రాజ్ పుత్ తో పులిహోర వేషాలు వేసిన ఆది బ్రో అంటూ ఆది పరువు తీసిన నటి!

Hyper Aadi: బుల్లితెరపై హైపర్ ఆదికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అన్ని తానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ పాయల్ హాజరయ్యారు.

ఈ విధంగా హీరోయిన్ వేదిక పైకి రాగానే హైపర్ ఆది తనతో పులిహోర వేషాలు వేయడానికి తెగ ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలోనే వేదికపై చిత్ర బృందంతో మాట్లాడుతూ ఉండగా పొట్టి నరేష్ తన వద్దకు వెళ్లి మాట్లాడటంతో పాయల్ తన బుగ్గను నరేష్ బుగ్గకు అనిచ్చి ముద్దు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది తనకు కూడా అలాంటిదే ఒకటి ఇచ్చేయమని అడుగుతారు.

ఈ క్రమంలోనే పాయల్ పొట్టి నరేష్ కు ఎలా అయితే బుగ్గను ఆనించిందో హైపర్ ఆదికి సైతం అలాగే తన బుగ్గను తాకిస్తూ బ్రో అనేసింది. దీంతో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం నవ్వులు పూయగా హైపర్ ఆది మొహం మాత్రం తెల్ల బోయింది. మొత్తానికి అందరూ ముందే బ్రో అంటూ పాయల్ హైపర్ ఆది పరువు తీసేసింది.

Hyper Aadi: ఎమోషనల్ అయినా హైపర్ ఆది…

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బుల్లితెర సెలబ్రిటీలు ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఓ విషయంలో పూర్తిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక స్టార్ హీరో వందరోజుల సినిమా ఫంక్షన్ లో సాయికుమార్ కి తండ్రి పి.జె.శర్మకి ఘోర అవమానం!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్నటువంటి సాయి కుమార్ తన తండ్రి కూడా ఓ మంచి నటుడు. సాయి కుమార్ తండ్రి పి.జె.శర్మ కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే పి.జె.శర్మ నటించిన ఓ సినిమా 100 రోజుల ఫంక్షన్ లో భాగంగా ఆ సినిమా ఫంక్షన్ ను తిరుపతిలో నిర్వహించారు. పి.జె.శర్మ కూడా అందులో నటించారు కనుక చిత్రబృందం అతనికి కూడా ఆహ్వానం పంపారు.

ఈ క్రమంలోనే శర్మ సినిమా ఫంక్షన్ కోసం తిరుపతి వెళ్లాలని తనతోపాటు సాయికుమార్ ను కూడా వెంట తీసుకు రమ్మని చెప్పారు. అయితే అప్పటికి సాయి కుమార్ తండ్రి మద్రాసులోనే నివసించేవారు. మద్రాస్ నుంచి తిరుపతికి చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లవచ్చని తన కొడుకు చెప్పారు. ఈ విధంగా మరుసటి రోజు ఉదయం ఆటోలు ఆఫీస్ దగ్గరికి వెళ్లిన శర్మకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏంటి అని ఆరా తీస్తే అప్పటికే అందరూ చార్టెడ్ ఫ్లైట్ లో తిరుపతికి వెళ్లారని, టెక్నీషియన్స్ కి సంబంధించిన బస్సులో వీరిని రమ్మని చెప్పారు అనడంతో పి.జె.శర్మ బాధపడ్డారు.

ఈ క్రమంలోనే సాయికుమార్ తన తండ్రికి నచ్చజెప్పి ఆ బస్సులో తిరుపతికి వెళ్లి వారందరూ ఉన్న హోటల్ వెళ్లి బసచేశారు. ఈ క్రమంలోనే సాయంత్రం సినిమా ఫంక్షన్ మొదలవగా పెద్ద ఎత్తున అభిమానులు ఆ ఫంక్షన్ కి రావడంతో త్వరగా ఫంక్షన్ ముగించుకుని తిరుగు ప్రయాణం చేయడం కోసం చార్టెడ్ ఫ్లైట్ లేకపోవడంతో అతిథులు అందరిని బస్సులో పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

అలాగే దారిలో చిత్రబృందం మొత్తం మూన్ లైట్ డిన్నర్ చేయాలని ప్లాన్ చేశారు.అయితే ఆ బస్సులో సాయి కుమార్, శర్మ వెళ్లి కూర్చోగా అక్కడికి వచ్చిన నిర్మాత వారిద్దరినీ కిందికి దిగి టెక్నీషియన్స్ కి సంబంధించిన బస్సులో రమ్మని చెప్పారు. ఆ మాటతో ఎంతో అవమానంగా ఫీల్ అయిన పి.జె.శర్మ మొహం మొత్తం వాడి పోయింది. ఈ క్రమంలోనే సాయికుమార్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఇక చేసేదేమి లేక టెక్నీషియన్స్ బస్సులో మద్రాస్ కు బయల్దేరారు. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒక ఒక పొట్లం ఒక క్వార్టర్ బాటిల్ రమ్ ఇచ్చారు.వాటిని పి.జె.శర్మ కూడా ఇవ్వడంతో నేను తాగడానికి కూడా అర్హుడిని కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ బాటిల్ విసిరికొట్టాడు.ఈ విధంగా వంద రోజుల ఫంక్షన్ కి వెళ్లి ఎంతో అవమాన పడిన ఎలాగైనా స్కాచ్ బాటిల్ కొని ఇవ్వాలని సాయికుమార్ భావించారు. ఓ సారి అమెరికాకు వెళ్ళినప్పుడు తన తండ్రికి స్కాచ్ బాటిల్ కొని తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చారని ఓ సందర్భంలో సాయి కుమార్ అప్పుడు జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.

ఆఫ్ట్రాల్ పిచ్చుక.. నేను వీడితో ఫైట్ చేయడం ఏంటి.. అంటూ ఎన్టీఆర్ లాగి కొట్టారు..! : సాయికుమార్

ఇటీవల విడుదలైన “ఎస్.ఆర్ కళ్యాణమండపం” మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విమర్షకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. దీంతో అందులో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ గారితో ఆ చిత్ర యూనిట్ చిన్న ఇంటర్వ్యూ పెట్టారు. అందులో అతడు మాట్లాడుతూ.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మెగస్టార్ చిరంజీవి ఆ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదన్నాడు.

హీరో వెంకటేష్ ,నాగార్జున లాంటి వారు కూడా సినిమా సినిమాకి మెచూరిటీ పెంచుకుంటూ వచ్చారని గుర్తుకు చేశాడు. అయితే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన వారి బ్లడ్ లోనే ఉందన్నారు. యాక్షన్ చేసే సమయంలో నందమూరి హీరోలు భయపడటం తాను ఏనాడు చూడలదేని.. ఏమాత్రం భయం లేకుండా అలవోకగా ఏ సీన్ అయినా నటిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. నందమూరి హీరోలందరితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.

సీనియర్ ఎన్టీఆర్ తో తను చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా విషయాలు కూడా ఈ సందర్బంగా పంచుకున్నాడు సాయికుమార్. ఆ సినిమలోని ఓ సీన్ గురించి అతడు ఈ సందర్భంగా చెప్పడు. ఎన్టీఆర్ తనని కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంది.. అయితే ఎన్టీఆర్ వెంటనే లేచి వీడు ఎంత నాకు పిచ్చుక లాంటి వాడు అని చెప్పి ఒక్క దెబ్బతో నన్ను కింద పడగొట్టేసాడు అని అతడు చెప్పాడు.

70 ఏళ్ల వయస్సులో కూడా ఎలాంటి డూప్ లు లేకుండా స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ ట్రాక్టర్ పైనుంచి దూకి విల్లన్ ను కొట్టే ఫైట్ సీన్ ను చేయడం చూసి నిజంగా చాలా ఆశ్చర్య పోయానని సాయి కుమార్ చెప్పాడు. ఇంత గొప్ప నుటల మధ్యలో చిరంజీవి గారు కూడా తన పేరును రాసుకున్నారని.. నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అంటూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సాయికుమార్ బయటపెట్టాడు.