ఇటీవల విడుదలైన “ఎస్.ఆర్ కళ్యాణమండపం” మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విమర్షకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. దీంతో అందులో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ గారితో ఆ చిత్ర యూనిట్ చిన్న ఇంటర్వ్యూ పెట్టారు. అందులో అతడు మాట్లాడుతూ.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మెగస్టార్ చిరంజీవి ఆ స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదన్నాడు.
హీరో వెంకటేష్ ,నాగార్జున లాంటి వారు కూడా సినిమా సినిమాకి మెచూరిటీ పెంచుకుంటూ వచ్చారని గుర్తుకు చేశాడు. అయితే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన వారి బ్లడ్ లోనే ఉందన్నారు. యాక్షన్ చేసే సమయంలో నందమూరి హీరోలు భయపడటం తాను ఏనాడు చూడలదేని.. ఏమాత్రం భయం లేకుండా అలవోకగా ఏ సీన్ అయినా నటిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. నందమూరి హీరోలందరితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
సీనియర్ ఎన్టీఆర్ తో తను చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమా విషయాలు కూడా ఈ సందర్బంగా పంచుకున్నాడు సాయికుమార్. ఆ సినిమలోని ఓ సీన్ గురించి అతడు ఈ సందర్భంగా చెప్పడు. ఎన్టీఆర్ తనని కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంది.. అయితే ఎన్టీఆర్ వెంటనే లేచి వీడు ఎంత నాకు పిచ్చుక లాంటి వాడు అని చెప్పి ఒక్క దెబ్బతో నన్ను కింద పడగొట్టేసాడు అని అతడు చెప్పాడు.
70 ఏళ్ల వయస్సులో కూడా ఎలాంటి డూప్ లు లేకుండా స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ ట్రాక్టర్ పైనుంచి దూకి విల్లన్ ను కొట్టే ఫైట్ సీన్ ను చేయడం చూసి నిజంగా చాలా ఆశ్చర్య పోయానని సాయి కుమార్ చెప్పాడు. ఇంత గొప్ప నుటల మధ్యలో చిరంజీవి గారు కూడా తన పేరును రాసుకున్నారని.. నిజంగా అన్నయ్య చాలా గ్రేట్ అంటూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సాయికుమార్ బయటపెట్టాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…